దేశ దిశ

Purple Alert Issued in 7 Telangana Districts as Temperatures Soar Above 45°C

Purple Alert Issued in 7 Telangana Districts as Temperatures Soar Above 45°C

  • తెలంగాణలో రోజు రోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలు
  • రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో 40 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు
  • రాష్ట్రంలోని 7 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసిన ఐఎండీ
  • ఈ జిల్లాల్లో 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే ఛాన్స్
Purple Alert Issued in 7 Telangana Districts as Temperatures Soar Above 45°C

తెలంగాణలో రోజు రోజుకు ఉష్ణోగ్రతల తీవ్రత పెరుగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో 40 డిగ్రీలు దాటింది. రాష్ట్రంలోని 7 జిల్లాలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం.. రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, జగిత్యాల, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, కొమరంభీమ్ ఆసిఫాబాద్ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది.. ఈ ఏడు జిల్లాల్లో 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే ఛాన్స్ ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది.. రెడ్ అలర్ట్ ఇచ్చిన ఏడు జిల్లాలు మినహా మిగిలిన జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ అయ్యింది..

READ MORE: Rajashekar : ఈ సారీ గట్టి ప్లాన్‌తో.. హీరో రాజశేఖర్ రీ ఎంట్రీ

గడిచిన రెండ్రోజుల్లో దాదాపు 8 మంది వడదెబ్బతో మృతి చెందినట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది. జీహెచ్‌ఎంసీ పరిసర జిల్లాల్లో రాత్రిపూట ఉష్ణోగ్రత పెరిగి తీవ్ర ఉక్కపోత ఉండనుంది.. ఉదయం 10 నుంచి 4 గంటల వరకు ప్రజలు బయటకు రాకుంటే మంచిదని వాతావరణ శాఖ తెలిపింది.. అత్యవసరం ఉంటేనే మధ్యాహ్నం బయటకు రావాలని ప్రజలకు ఐఎండీ సూచించింది. రైతులు.. కూలీలకు వడదెబ్బ ప్రభావం ఉండే ఛాన్స్ ఉందని జాగ్రత్తలు పాటించాలని స్పష్టం చేసింది.

READ MORE: Padi Kaushik Reddy: “అప్పటి వరకు అరెస్ట్ చేయొద్దు”.. పాడి కౌశిక్ రెడ్డికి హైకోర్టులో ఊరట..

Exit mobile version