
మెగా సుప్రీం హీరో సాయి దుర్గా తేజ్ నటిస్తున్న తాజా చిత్రం ‘సంబరాల ఏటి గట్టు’. ‘విరూపాక్ష’, ‘బ్రో’ చిత్రాల తర్వాత రెండు సంవత్సరాలు గ్యాప్ తీసుకొని తేజ్ నటిస్తున్న చిత్రం ఇది కావడంతో దీనిపై అంచనాలు ఓ రేంజ్లో ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన అప్డేట్స్ అన్నిటికీ మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే బుధవారం తేజ్ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా గ్లింప్స్ని విడుదల చేశారు. ‘అసుర ఆగమనం’ పేరుతో విడుదలైన ఈ గ్లింప్స్ సినిమాపై అంచనాలను మరో లెవల్కి తీసుకెళ్లింది.
ఈ గ్లింప్స్ బట్టి చూస్తే మాస్ యాక్షన్ మూవీ అని క్లారిటీ వచ్చింది. గ్లింప్స్లోని ప్రతీ షాట్ అదిరిపోయిందిని ఫ్యాన్స్ అంటున్నారు. చివర్లో ‘అసుర సంధ్యవేళ మొదలైంది.. రాక్షసుల ఆగమనం’ అంటూ తేజ్ చెప్పిన డైలాగ్ హైలైట్గా నిలిచింది. ఇక ఈ సినిమాకి రోహిత్ కె.పి దర్శకత్వం వహిస్తుండగా.. ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్గా నటిస్తోంది. నిజానికి ఈ సినిమా ఈ నెలలోనే విడుదల చేస్తామంటూ చాలాసార్లు ప్రకటించారు. కానీ, ఇంకా షూటింగ్ పూర్తి కాకపోవడంతో దాన్ని వాయిదా వేశారు. మరి సినిమాను ఈ ఏడాది తీసుకొస్తారా..? లేదా వచ్చే ఏడాదికి వాయిదా..? పడుతుందో చూడాలి.