ఏపీ ఈసెట్ – 2025 ద్వారా 2025-26 విద్యాసంవత్సరానికి సంబంధించి.. బీఈ, బీటెక్, బీఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. పాలిటెక్నిక్ డిప్లొమా, బీఎస్సీ(మ్యాథ్స్) అభ్యర్థులకు లేటరల్ ఎంట్రీ విధానంలో రెండో ఏడాదిలో ప్రవేశాలు కల్పిస్తారు. ఈ ఏడాది ఏపీ ఈసెట్ను అనంతపురం జవహర్లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ నిర్వహిస్తుంది.