WTC 2027: డబ్ల్యూటీసీ పాయింట్లలో కీలక మార్పులు.. భారత్, ఇంగ్లండ్ సిరీస్‌తో కొత్త విధానం.. అదేంటంటే?

Written by RAJU

Published on:


ICC World Test Championship 2027: ఐసీసీ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC)లో ఇప్పటివరకు రెండు సీజన్లు పూర్తయ్యాయి. అయితే, రెండవ, మూడవ సీజన్ల ఫైనల్స్ ఇంకా జరగలేదు. కానీ, ఈసారి టైటిల్ మ్యాచ్ ఆస్ట్రేలియా వర్సెస్ దక్షిణాఫ్రికా మధ్య జరగనుంది. జూన్‌లో ఫైనల్ జరుగుతుంది. ఇది జూన్ 11 నుంచి లార్డ్స్‌లో జరుగుతుంది. ఇదిలా ఉండగా, ఈ ఏడాది జూన్ నుంచి ప్రారంభం కానున్న WTC మూడవ దశకు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) సన్నాహాలు ప్రారంభించింది.

ఈ మేరకు ఐసీసీ కొత్త వ్యవస్థను పరిశీలిస్తోంది. దీనిలో జట్లకు బోనస్ పాయింట్లు ఇచ్చే అవకాశం ఉంది. దీనివల్ల పాయింట్ల పట్టికలో దిగువన ఉన్న జట్లకు తిరిగి పుంజుకోవడానికి మంచి అవకాశం లభిస్తుంది.

WTC మూడవ దశ జూన్‌లో ప్రారంభం..

WTC మూడవ దశ జూన్‌లో ప్రారంభమవుతుంది. దీనికి ముందు, ఏప్రిల్‌లో ఐసీసీ ముఖ్యమైన సమావేశం ప్రతిపాదించనుంది. దీనిలో బోనస్ పాయింట్లను చర్చించవచ్చు. నివేదికల ప్రకారం, సమావేశంలో ఏకాభిప్రాయం కుదిరితే, ఈ కొత్త నియమాన్ని భారత్, ఇంగ్లాండ్ మధ్య జరిగే ఐదు టెస్ట్‌ల సిరీస్‌తో అమలు చేయవచ్చు అని అంటున్నారు.

ఇవి కూడా చదవండి

ప్రస్తుత నిబంధనల ప్రకారం, టెస్ట్ మ్యాచ్ గెలిచిన జట్టుకు 12 పాయింట్లు లభిస్తాయి. టై అయితే, రెండు జట్లకు చెరో 6 పాయింట్లు, డ్రా అయితే చెరో 4 పాయింట్లు లభిస్తాయి. అయితే, ఒక కొత్త నివేదిక ప్రకారం, ఒక జట్టు పెద్ద తేడాతో లేదా ఇన్నింగ్స్ తేడాతో గెలిస్తే, దానికి అదనపు బోనస్ పాయింట్లు ఇవ్వనున్నారంట.

ఈ విధానం అమలు చేయబడితే, జట్లు గెలుపు వ్యూహాన్ని రూపొందించడమే కాకుండా పాయింట్ల పట్టికలో తమ స్థానాన్ని బలోపేతం చేసుకోవడానికి పెద్ద తేడాతో గెలవడానికి కూడా ప్రయత్నించాల్సి ఉంటుంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Subscribe for notification