ప్రమాదం జరిగిన వెంటనే ఆర్టీసీ డ్రైవర్, కండక్టర్ బస్సు దిగి అక్కడ పరిశీలించారు. అక్కడ కనుజు మాంసం, కొండగొర్రె కళేబరాన్ని చూసి షాక్ అయ్యారు. వెంటనే స్థానిక ఫారెస్ట్, పోలీస్ అధికారులు సమాచారం అందించారు. కాగా ప్రమాదం జరిగిన తరువాత వన్య ప్రాణుల వేట విషయం బయటపడటంతో దుండగులు హుటాహుటిన అక్కడి నుంచి తప్పించుకున్నారు. బోల్తా పడిన ఆటోను లేపి, కనుజు మాంసంతో అక్కడి నుంచి ఉడాయించారు.