
వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో మనీ ప్లాంట్ పెంచుకోవడం వల్ల అదృష్టం కలిసి వస్తుందని చెబుతుంటారు. కానీ, ఈ మొక్కను మీ ఇంట్లో ఉంచుకోవడం వల్ల మనీ ప్లాంట్ మాదిరిగానే ఆ ఇంటికి అదృష్టాన్ని ఇస్తుందని వాస్తుశాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి సంపద పెరుగుతుందని అంటున్నారు. ఈ మొక్క మనీ ప్లాంట్ కంటే మరింత సమర్థవంతంగా పనిచేస్తుందని చెబుతున్నారు. అలాంటి మొక్క గురించిన పూర్తి సమాచారం ఇక్కడ తెలుసుకుందాం..
క్రాసులా మొక్కను శుభప్రదంగా భావిస్తారు. ఈ మొక్కను ఇంట్లో ఉంచుకోవడం వల్ల ఇంట్లో ఆర్థిక సమస్యలు రాకుండా ఉంటాయని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. జ్యోతిషశాస్త్రం ప్రకారం, ఈ మొక్క చంద్రుడు, శుక్రుడితో సంబంధం కలిగి ఉంటుంది. ఈ మొక్కను తూర్పు, ఉత్తరం లేదా ఈశాన్య దిశలో ఉంచాలి. వాస్తు శాస్త్రం ప్రకారం, ఈ మొక్క ప్రతికూల శక్తిని తొలగిస్తుంది. ఇది ఆర్థిక స్థిరత్వానికి చిహ్నంగా పరిగణించబడుతుంది. ఈ మొక్క ఇంట్లో మానసిక ప్రశాంతత, శ్రేయస్సును పెంపొందిస్తుందని చెబుతున్నారు.
జ్యోతిషశాస్త్రం ప్రకారం, సంపద, కీర్తి, ఆనందానికి శుక్రుడు కారణమైన గ్రహం. ఈ మొక్కను ఇంట్లో ఉంచుకోవడం వల్ల శుక్రుని ప్రభావం మీపై ఉంటుందని తద్వారా మీ అదృష్టం పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. వాస్తు శాస్త్రం ప్రకారం, ఈ మొక్క సంపదను ఆకర్షిస్తుంది. కాబట్టి ఈ మొక్కను ప్రధాన ద్వారానికి కుడి వైపున లేదా ఈశాన్య దిశలో ఉంచాలని సూచిస్తున్నారు.
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి