TSPSC Results : టీఎస్‌పీఎస్సీ గ్రూప్‌ 3 రిజల్ట్‌ 2025.. హోలీ పండుగ నాడు ఫలితాలు వెల్లడి!

Written by RAJU

Published on:

Telangana Group 3 Results : తెలంగాణ గ్రూప్స్‌ పరీక్షల ఫలితాల విడుదల ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటికే గ్రూప్‌ 1, 2 పరీక్షల రిజల్ట్‌ విడుదలయ్యాయి. ఈక్రమంలో..

Samayam Teluguతెలంగాణ గ్రూప్‌ 3 రిజల్ట్‌ 2025
తెలంగాణ గ్రూప్‌ 3 రిజల్ట్‌ 2025

TSPSC Group 3 Results 2025 : తెలంగాణలో ఉద్యోగ నియామకాల ప్రక్రియ వేగం పుంజుకుంది. కట్టుదిట్టంగా పరీక్షలు నిర్వహించడంతో పాటు.. వేగంగా ఫలితాలను విడుదల చేయడానికి తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (TGPSC) పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతోంది. ఈక్రమంలో టీజీపీఎస్సీ గ్రూప్‌ 1, 2, 3 ఉద్యోగాల భర్తీకి నిర్వహించిన రాతపరీక్షల ఫలితాలను యుద్ధప్రాతిపదిక విడుదల చేస్తోంది. ఇందులో భాగంగానే సోమవారం (మార్చి 10) గ్రూప్‌ 1 ఫలితాలు విడుదల చేసిన విషయం తెలిసిందే.

అనంతరం మంగళవారం (మార్చి 11) గ్రూప్‌ 2 పరీక్ష ఫలితాలు విడుదల చేశారు. ఇందులో భాగంగానే టీఎస్‌పీఎస్సీ గ్రూప్-2 అభ్యర్థుల జనరల్ ర్యాంకింగ్ జాబితాను విడుద‌ల చేశారు. టీఎస్‌పీఎస్సీ 783 గ్రూప్‌-2 పోస్టుల‌కు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేష‌న్ ఇచ్చిన విష‌యం తెల్సిందే. అలాగే 1,363 గ్రూప్-3 పోస్టుల‌కు భర్తీకి గతేడాది నవంబర్ 17, 18 తేదీల్లో 1,401 పరీక్ష కేంద్రాల్లో రాత పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షకు సంబంధించిన ఫలితాలు మార్చి 14న హోలీ పండుగ రోజు విడుదల చేయనున్నారు. ఎగ్జామ్‌కి హాజరైన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా తమ ఫలితాలను చెక్‌ చేసుకోవచ్చు.

ఇదిలా ఉంటే మిగిలిన వివిధ పోటీ పరీక్షల ఫలితాలను కూడా వీలైనంత త్వరగా విడుదల చేసేందుకు టీఎస్‌పీఎస్సీ సన్నాహాలు చేస్తోంది. మార్చి 20వ తేదీ లోపు అన్ని పోటీ పరీక్షల ఫ‌లితాలు వెల్లడిస్తామని అధికారులు తెలిపారు. మార్చి 14వ తేదీన‌ గ్రూప్-3, మార్చి 17వ తేదీన‌ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్, మార్చి 19వ తేదీన‌ ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్ ఫ‌లితాల‌ను విడుద‌ల చేస్తామ‌ని టీజీపీఎస్సీ స్పష్టం చేసింది. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత కొత్త నోటిఫికేషన్లపై దృష్టి సారించనున్నట్లు తెలుస్తోంది.

1,532 మంది కొత్త అధ్యాపకులకు నియామక పత్రాలు అందజేత

ఉన్నత విద్యాశాఖలో నూతనంగా అధ్యాపకులుగా ఎంపికైన 1,532 మందికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) చేతుల మీదుగా మార్చి 12న నియామక పత్రాలను అందజేశారు. రవీంద్రభారతిలో జరిగే కార్యక్రమానికి సీఎం హాజరయ్యారు. మొత్తం 1532 మందిలో జూనియర్‌ అధ్యాపకులు 1292 మంది కాగా.. వీరిలో 794 మంది పురుషులు, 498 మంది మహిళలు ఉన్నారు. ఇక పాలిటెక్నిక్‌ అధ్యాపకులు 240 మందిలో.. 177 మంది పురుషులు, 63 మంది మహిళలు ఉన్నారు.

కిషోర్‌ రెడ్డి

రచయిత గురించికిషోర్‌ రెడ్డికిషోర్‌ రెడ్డి డైనమిక్ రైటర్, డిజిటల్ మీడియా ప్రొఫెషనల్. ఈ రంగంలో 6.8 సంవత్సరాల అనుభవం ఉంది. అతను డిజిటల్ మీడియాలో తన ప్రస్థానం ప్రారంభించినప్పటి నుంచి రాజకీయ, సినిమా, విద్య, ఉద్యోగాలు సహా అనేక విభాగాలను నిర్వహించడంలో గణనీయమైన నైపుణ్యాన్ని పొందారు.
రాయడంలో అతనికున్న అభిరుచి, కరెంట్ అఫైర్స్‌పై లోతైన జ్ఞానంతో కిషోర్‌ ఈ పరిశ్రమలో తనకంటూ ఒక పేరు తెచ్చుకున్నారు. విభిన్న విభాగాలలోని పాఠకులకు ఆకర్షణీయమైన సందేశాత్మక కంటెంట్‌ను రూపొందించారు. ప్రస్తుతం అతను పనిచేస్తున్న విభాగంలో.. 4.5 ఏళ్లుగా నిర్దిష్ట విభాగాన్ని నిర్వహిస్తున్నారు. అతను వ్యూవర్స్‌కు నచ్చే అత్యంత నాణ్యమైన కంటెంట్‌ను స్థిరంగా అందిస్తున్నారు.
కిషోర్‌ ఖాళీగా ఉన్నప్పుడు పుస్తకాలు చదవడం, ప్రముఖుల ఇంటర్వ్యూలు చూడటం వంటివి చేస్తుంటారు. ఈ పనులు తనను రిలాక్స్ చేస్తాయని, క్రియేటివిటీని రీఛార్జ్‌ చేస్తాయని అతను నమ్ముతున్నాడు.
… ఇంకా చదవండి

Subscribe for notification