TGPSC Group 2 Result 2025 : తెలంగాణలో గ్రూప్ 2 ఉద్యోగ నియామకాలకు సంబంధించిన రాత పరీక్ష ఫలితాలు విడుదల చేయడానికి టీజీపీఎస్సీ కమిషన్ ఏర్పాట్లు చేస్తోంది. వివరాల్లోకెళ్తే..

TSPSC Group 1 Mains Result 2025 : గ్రూప్ 1 ఫలితాల విడుదలకు సుప్రీంకోర్ట్ గ్రీన్ సిగ్నల్
తెలంగాణ రాష్ట్రంలో 563 గ్రూప్ 1 సర్వీసు పోస్టుల భర్తీకి నిర్వహించిన రాత పరీక్షల ఫలితాల వెల్లడికి అడ్డంకులు తొలగిపోయాయి. జీవో నం.29కు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టివేసింది. జీవో 29ను సవాలు చేయడంతో పాటు వికలాంగుల రిజర్వేషన్ అంశాలపై పలువురు గ్రూప్-1 అభ్యర్థులు సుప్రీంకోర్టును ఆశ్రయించడం, దానిపై టీజీపీఎస్సీ కేవియట్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. విచారణ జరిపి అభ్యర్థుల పిటిషన్లను కొట్టివేసిన సుప్రీంకోర్టు.. టీజీపీఎస్సీ గ్రూప్ 1 ఫలితాల వెల్లడికి అనుమతించింది.
దీంతో టీఎస్పీఎస్సీ గ్రూప్-1 ఫలితాలను సోమవారం (మార్చి 10) టీజీపీఎస్సీ కమిషన్ విడుదల చేసింది. గ్రూప్-1 నియామకాలపై అభ్యర్థులు పలు అభ్యంతరాలతో హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్లను హైకోర్టు కొట్టివేయడంతో సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. తాజాగా గ్రూప్-1 ఫలితాల వెల్లడికి అడ్డంకిగా మారిన పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టివేయడంతో ఫలితాల విడుదలకు మార్గం సుగమమైంది. దీంతో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత 11 ఏళ్లకు తొలిసారి గ్రూప్-1 నియామకాలు జరగనున్నాయి.
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 పరీక్ష ప్రశ్నాపత్రం లీకవడంతో రద్దయింది. అనంతరం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రూప్-1 పరీక్షను మళ్లీ నిర్వహించింది. అయితే ఈ పరీక్షను వాయిదా వేయాలని కొందరు అభ్యర్థులు డిమాండ్ చేసినప్పటికీ ప్రభుత్వం పట్టించుకోకుండా పరీక్ష నిర్వహించింది. ప్రస్తుతం సుప్రీంకోర్టు గ్రీన్సిగ్నల్ ఇవ్వడంతో ఫలితాలు సోమవారం (మార్చి 10) విడుదల చేశారు.