Tgrjc Cet 2025,Gurukulam Information : గురుకుల కాలేజీల్లో ఇంటర్‌ అడ్మిషన్లు.. TSRJC CET 2025 అప్లికేషన్లు ప్రారంభం – tgrjc cet 2025 notification out apply at tgrjc cgg gov in inter 1st 12 months admissions

Written by RAJU

Published on:

Telangana Inter 1st Year Admissions : తెలంగాణ గురుకుల రెసిడెన్షియల్‌ కాలేజీల్లో ఇంటర్మీడియట్‌ ఫస్టియర్‌ అడ్మిషన్లకు సంబంధించిన ప్రవేశ పరీక్ష నోటిఫికేషన్‌ విడుదలైంది.

హైలైట్:

  • టీజీఆర్‌జేసీ సెట్‌ 2025 నోటిఫికేషన్‌
  • మార్చి 24 నుంచి దరఖాస్తులు ప్రారంభం
  • ఏప్రిల్‌ 23 దరఖాస్తులకు చివరితేది

Samayam Teluguటీజీఆర్‌జేసీ సెట్‌ 2025
టీజీఆర్‌జేసీ సెట్‌ 2025

TGRJC CET 2025 Notification : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 35 గురుకుల రెసిడెన్షియల్‌ జూనియర్‌ కాలేజీల్లో 2025-26 విద్యా సంవత్సరానికిగానూ ఇంటర్మీడియట్ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి టీజీ ఆర్‌జేసీసెట్‌ 2025 నోటిఫికేషన్‌ విడుదలైంది. నోటిఫికేషన్‌ ప్రకారం.. మార్చి 24వ తేదీ నుంచి అభ్యర్థులు ఆర్‌జేసీసెట్‌ పరీక్షకు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. ఏప్రిల్‌ 23వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఈ మేరకు తెలంగాణ గురుకుల విద్యాలయాల సంస్థ నోటిఫికేషన్‌ జారీ చేసింది. అభ్యర్థులు పూర్తి వివరాలు తెలుసుకోవడానికి, అప్లయ్‌ చేసుకోవడానికి అధికారిక వెబ్‌సైట్‌ https://www.tgrjc.cgg.gov.in/ చూడొచ్చు. మరిన్ని వివరాలకు 040-24734899 ఫోన్ నంబరుకు పని వేళల్లో ఫోన్ చేసి సమాచారం పొందొచ్చని సంస్థ పేర్కొంది. గురుకుల జూనియర్‌ కాలేజీల్లో ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ గ్రూపుల్లో ఇంగ్లిష్‌ మీడియం చదవాలనుకునేవారు ఈ ప్రవేశ పరీక్ష ద్వారా ప్రవేశాలు పొందొచ్చు. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న గురుకుల కాలేజీల్లో ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ గ్రూపులు.. ఇంగ్లీష్ మీడియంలో అందుబాటులో ఉన్నాయి.

అప్లయ్‌ చేసుకున్న అభ్యర్థులకు పరీక్ష నిర్వహించి.. వారు పొందిన మార్కుల ప్రకారం ఆయా కాలేజీల్లో, కోర్సుల్లో సీటు కేటాయిస్తారు. ఆసక్తి కలిగిన వారు అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. ప్రస్తుత విద్యా సంవత్సరంలో పదో తరగతి చదువుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఈ టీజీఆర్‌జేసీ 2025 ప్రవేశ పరీక్షలో సాధించిన మార్కులు, రిజర్వేషన్ ఆధారంగా సీట్లను కేటాయిస్తారు.

తెలంగాణ గురుకులాల్లో 5వ తరగతి అడ్మిషన్లు.. త్వరలో TGCET 2025 Results విడుదల
TS Gurukulam 5th Class Results 2025 : తెలంగాణ (Telangana) గురుకుల విద్యాలయాల్లో 5వ తరగతి ప్రవేశాలకు సంబంధించిన ప్రవేశ పరీక్ష ఫిబ్రవరి 23వ తేదీన నిర్వహించారు. తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తోన్న సోషల్‌ వెల్ఫేర్‌, ట్రైబల్ వెల్ఫేర్‌, బీసీ వెల్ఫేర్‌, గురుకుల విద్యాలయ సంస్థల్లో ప్రవేశాల కోసం ఉమ్మడి ప్రవేశ పరీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి TGSWREIS, TGTWREIS, MJPTBCWREIS, TGREIS విద్యాసంస్థల ఆధ్వర్యంలో 5వ తరగతిలో ప్రవేశాలకై ఉమ్మడి ప్రవేశ పరీక్ష (Telangana Gurukul CET 2025) నిర్వహించారు.

TGCET 2025 పరీక్షకు సంబంధించిన ఫలితాలను త్వరలో విడుదల చేయనున్నారు. తాజా సమాచారం ప్రకారం.. మార్చి నెలాఖరు లోపు TGCET 2025 Results విడుదల చేసే అవకాశం ఉంది. త్వరలో ఫలితాల విడుదల తేదీపై అధికారిక ప్రకటన రానుంది. విద్యార్థులు రిజల్ట్‌ విడుదలయ్యాక అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా తమ ఫలితాలను చెక్‌ చేసుకోవచ్చు. తెలంగాణ గురుకుల పాఠశాలల్లో 5వ తరగతిలో అడ్మిషన్ల కోసం 2025 ఫిబ్రవరి 23వ తేదీన ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు రాష్ట్రంలోని అన్నీ జిల్లాల్లో ఎంపిక చేసిన పరీక్ష కేంద్రాల్లో TG Gurukul CET 2025 ప్రవేశ పరీక్ష నిర్వహించారు.

కిషోర్‌ రెడ్డి

రచయిత గురించికిషోర్‌ రెడ్డికిషోర్‌ రెడ్డి డైనమిక్ రైటర్, డిజిటల్ మీడియా ప్రొఫెషనల్. ఈ రంగంలో 6.8 సంవత్సరాల అనుభవం ఉంది. అతను డిజిటల్ మీడియాలో తన ప్రస్థానం ప్రారంభించినప్పటి నుంచి రాజకీయ, సినిమా, విద్య, ఉద్యోగాలు సహా అనేక విభాగాలను నిర్వహించడంలో గణనీయమైన నైపుణ్యాన్ని పొందారు.
రాయడంలో అతనికున్న అభిరుచి, కరెంట్ అఫైర్స్‌పై లోతైన జ్ఞానంతో కిషోర్‌ ఈ పరిశ్రమలో తనకంటూ ఒక పేరు తెచ్చుకున్నారు. విభిన్న విభాగాలలోని పాఠకులకు ఆకర్షణీయమైన సందేశాత్మక కంటెంట్‌ను రూపొందించారు. ప్రస్తుతం అతను పనిచేస్తున్న విభాగంలో.. 4.5 ఏళ్లుగా నిర్దిష్ట విభాగాన్ని నిర్వహిస్తున్నారు. అతను వ్యూవర్స్‌కు నచ్చే అత్యంత నాణ్యమైన కంటెంట్‌ను స్థిరంగా అందిస్తున్నారు.
కిషోర్‌ ఖాళీగా ఉన్నప్పుడు పుస్తకాలు చదవడం, ప్రముఖుల ఇంటర్వ్యూలు చూడటం వంటివి చేస్తుంటారు. ఈ పనులు తనను రిలాక్స్ చేస్తాయని, క్రియేటివిటీని రీఛార్జ్‌ చేస్తాయని అతను నమ్ముతున్నాడు.
… ఇంకా చదవండి

Subscribe for notification