ఈ ఎంట్రెన్స్ ద్వారా రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీతో పాటు సాధారణ గురుకులాల్లో (TGSWREIS, TGTWREIS, MJPTBCWREIS, TGREIS) 5వ తరగతి అడ్మిషన్లు కల్పిస్తారు. 2025-26 విద్యాసంవత్సరానికి గాను ఉమ్మడి పరీక్ష నిర్వహించారు. ఈ ఏడాది 50 వేలకు పైగా సీట్లు అందుబాటులో ఉన్నాయి. విద్యార్థి సాధించిన ర్యాంక్ ఆధారంగా సీట్లను కేటాయిస్తారు.