Telangana Govt Releases Pointers for 1061 Assistant Professor Posts

Written by RAJU

Published on:

  • 15 ఏళ్ల తర్వాత అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీ
  • పేద విద్యార్థులపై నిర్లక్ష్యం చేసిన గత పాలనపై సీఎం విమర్శలు
  • విద్యా రంగ పునర్నిర్మాణానికి ప్రజా ప్రభుత్వ తొలి అడుగు
Telangana Govt Releases Pointers for 1061 Assistant Professor Posts

CM Revanth Reddy : తెలంగాణ రాష్ట్రంలో విద్యారంగ పునర్నిర్మాణం వైపు ప్రజా ప్రభుత్వం బలమైన అడుగులు వేస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాజాగా ట్వీట్టర్‌ వేదికగా ఒక ముఖ్యమైన ప్రకటన చేశారు. రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్న 1061 అసిస్టెంట్ ప్రొఫెసర్‌ పోస్టుల భర్తీకి మార్గదర్శకాలు విడుదల చేసినట్టు తెలిపారు. ఈ ప్రక్రియను 15 సంవత్సరాల పాటు నిర్వహించకపోవడం నిజంగా షాకింగ్ అని వ్యాఖ్యానించారు.

గత ప్రభుత్వ పాలనలో విద్య రంగం పట్ల చూపిన నిర్లక్ష్యం పేద బిడ్డల భవిష్యత్‌ను దెబ్బతీసిందని సీఎం విమర్శించారు. ఇది క్షమించలేని నేరమని ఆయన పేర్కొన్నారు. పేద విద్యార్థులకు ఉన్నత విద్య అందించడంలో ప్రభుత్వం విఫలమైన తీరు రాష్ట్రం అభివృద్ధికి అడ్డు త్రాసిందని చెప్పారు.

ఈ మేరకు జరిగిన పొరపాట్లను గుర్తిస్తూ, సరిచేస్తూ ప్రజా ప్రభుత్వం రాష్ట్ర పునర్నిర్మాణం దిశగా ముందుకు సాగుతోందని స్పష్టం చేశారు. ముఖ్యంగా విద్యా వ్యవస్థలో గల ఖాళీలను నింపుతూ, నాణ్యతగల బోధనకు అవసరమైన మానవ వనరులను సమకూర్చే దిశగా ఈ చర్యలు ఎంతో కీలకమని వ్యాఖ్యానించారు.

ఈ పోస్టుల భర్తీతో రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలకు కొత్త ఊపిరి లభించనుంది. విద్యార్థులకు మెరుగైన విద్యా వాతావరణం అందించేందుకు ఇది కీలక దశగా మారనుంది. ముఖ్యంగా పేద కుటుంబాల నుండి వచ్చిన విద్యార్థులకు ఇది ఒక రకం న్యాయం కూడా.

విద్యా రంగాన్ని బలోపేతం చేయడమే రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి మించిన దారి అంటూ, ముఖ్యమంత్రి పేర్కొంటూ ఈ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.

YSRCP: వైఎస్ జగన్ పర్యటనలో భద్రతా వైఫల్యం..! హెలికాఫ్టర్ విండ్‌షీల్డ్ ధ్వంసంపై అనుమానాలు..

Leave a Comment

Subscribe for notification
Verified by MonsterInsights