సూర్యాపేట(Suryapet)లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం(road accident) అందరినీ కలచివేసింది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ప్రాణాలు కోల్పోవడం, ఈ ఘటనను మరింత విషాదంగా మార్చింది. ఈ దుర్ఘటన చివ్వెం మండలంలోని బీబీగూడెం వద్ద చోటు చేసుకుంది. ఆర్టీసీ బస్సు, ఒక కారును ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో దంపతులు, వారి ఎనిమిదేళ్ల కూతురు ప్రాణాలు కోల్పోయారు. మృతులను మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలంలోని కంఠాయపాలెం గ్రామానికి చెందిన గడ్డం రవీందర్, రేణుక, వారి కుమార్తె రితిక(8)గా గుర్తించారు.
కేసు నమోదు చేసిన పోలీసులు
ఖమ్మం నుంచి బస్సు సూర్యాపేట వెళ్తున్న క్రమంలో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో మరో ముగ్గురికి గాయాలైనట్లు తెలుస్తోంది. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు, పోలీసులు, అంబులెన్స్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతులను ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి, విచారణ ప్రారంభించారు. ప్రమాదానికి సంబంధించిన మరింత సమాచారం సేకరించడానికి వారు సాక్షులను ప్రశ్నిస్తున్నారు.
ప్రజలకు సూచన..
ఈ ప్రమాదం జరిగిన సమయంలో ఆర్టీసీ బస్సు వేగంగా ప్రయాణిస్తున్నట్లు సమాచారం. మలుపు వద్ద రెండు వాహనాలు వేగంగా వచ్చిన క్రమంలోనే ఈ ఘోర ప్రమాదం జరిగి ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. సూర్యాపేటలో జరిగిన ఈ ప్రమాదం స్థానిక ప్రజల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ఘటన గురించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ప్రమాదం నేపథ్యంలో వేగం నియంత్రణతోపాటు డ్రైవింగ్ సమయంలో శ్రద్ధ వహించాలని పోలీసులు ప్రజలకు సూచిస్తున్నారు. దీంతోపాటు రోడ్డు భద్రతా నియమాలను పాటించాలని కోరుతున్నారు.
ఇవి కూడా చదవండి:
Layoffs: ఎంది సామి..మళ్లీ 9 వేల లే ఆఫ్స్, ఇక మిగిలేది ఎవరు..
Onion Prices: గుడ్ న్యూస్..ఎగుమతి సుంకం రద్దు, తగ్గనున్న ఉల్లి ధరలు..
Health Insurance Premium: గ్రామల్లో కంటే, మెట్రో నగరాల్లో ఆరోగ్య బీమాకు ఎక్కువ చెల్లింపు..కారణాలివే..
Recharge Offer: క్రేజీ ఆఫర్..రూ.5కే డేటాతోపాటు అన్ లిమిటెడ్ కాలింగ్..
NASSCOM: వచ్చే రెండేళ్లలో లక్ష మంది విద్యార్థులకు ఉచితంగా ఏఐ శిక్షణ
Call Merging Scam: కొత్త రకం మోసం కాల్ మెర్జింగ్ స్కామ్..అలర్ట్ చేసిన కేంద్రం..
Read More Business News and Latest Telugu News
Updated Date – Mar 23 , 2025 | 06:47 PM