లారీలో ఉన్న పత్తి గింజల బస్తాలు సంధ్య, పూలమ్మపై కూలాయి. మరికొంత మంది త్రుటిలో తప్పించుకున్నారు. కాగా బస్తాలు మీద కూలడంతో సంధ్య, పూలమ్మ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న పోలీసులు క్రేన్, జేసీబీ సహాయంతో బస్తాలను తొలగించి ఇద్దరి మృతదేహాలను వెలికి తీశారు. అనంతరం పోస్టుమార్ధం నిమిత్తం చిట్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.