- మావోయిస్టుల లేఖపై స్పందించిన ములుగు ఎస్పీ శబరీష్
- బాంబు బెదిరింపుల మధ్య ఆదివాసుల భద్రతకు హామీ
- కర్రెగుట్టల్లో కూంబింగ్ ఆపరేషన్ ముమ్మరం

SP Shabarish : ములుగు జిల్లా కర్రెగుట్టల ప్రాంతంలో మావోయిస్టులు బాంబులు పెట్టినట్టు మంగళవారం ఓ లేఖ ద్వారా ప్రకటన విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ లేఖపై ములుగు జిల్లా ఎస్పీ శబరీష్ గారు స్పందించారు. ప్రజల్లో భయం కలిగించే ప్రయత్నాల్లో భాగంగా చట్టవిరుద్ధ చర్యలకు పాల్పడుతున్న మావోయిస్టులకు మాత్రం ఇది సరైన మార్గం కాదని స్పష్టం చేశారు.
అడవుల్లో నివసిస్తూ తమ జీవనోపాధిని సాగిస్తున్న ఆదివాసీలపై ఈ విధమైన బెదిరింపులు న్యాయసమ్మతం కావని ఎస్పీ చెప్పారు. అడవి ఉత్పత్తులపై ఆధారపడే ఆదివాసుల జీవనశైలి కాపాడాల్సిన అవసరం ఉందని, బాంబుల పేరిట వారిని భయభ్రాంతులకు గురిచేయడాన్ని తాను తీవ్రంగా ఖండిస్తున్నట్టు తెలిపారు.
ఇలాంటి చర్యలు కేవలం వారి జీవనోపాధినే కాదు, సమాజ శాంతియుత వాతావరణాన్నీ ప్రభావితం చేస్తాయని ఎస్పీ పేర్కొన్నారు. మావోయిస్టుల బెదిరింపులకు భయపడాల్సిన అవసరం ప్రజలకెందుకోదని, ములుగు పోలీసులు ప్రజలకీ పూర్తి భద్రత కల్పించే బాధ్యత తీసుకుంటారని హామీ ఇచ్చారు.
అటవీ ప్రాంతాల్లో కూంబింగ్ ఆపరేషన్లను ముమ్మరం చేసినట్టు వెల్లడించిన ఎస్పీ, మావోయిస్టులకు సహకరించే వారిపై కూడా కఠిన చర్యలు తీసుకోబోతున్నామని హెచ్చరించారు. చట్టానికి వ్యతిరేకంగా వ్యవహరించిన వారిని వదిలిపెట్టేది లేదన్నారు. ఆదివాసుల సంక్షేమం కోసం పోలీసులు ఎల్లప్పుడూ ముందుండి పని చేస్తారని, వారి హక్కులు, భద్రతను కాపాడేందుకు తాము నిరంతరం సిద్ధంగా ఉన్నామని ఎస్పీ శబరీష్ తెలిపారు.
Minister Seethakka : బడిబాట తరహాలో పిల్లలను గుర్తించి అంగన్వాడీల్లో చేర్పించాలి