SBI ATM Guidelines: ఛార్జీల బాదుడు.. మీరు ఏటీఎం నుంచి విత్‌డ్రా చేస్తున్నారా? కొత్త నిబంధనలు! – Telugu Information | SBI modified the principles for ATM withdrawal now you to pay this a lot cash for over transaction

Written by RAJU

Published on:

దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏటీఎం నుంచి డబ్బులు తీసుకునే నిబంధనలలో పెద్ద మార్పు చేసింది. ఈ నియమం తర్వాత మీరు ఏదైనా ఇతర బ్యాంకు ATM నుండి నిర్దేశించిన పరిమితి కంటే ఎక్కువ విత్‌డ్రా చేస్తే, మీరు ప్రతి లావాదేవీపై అదనపు రుసుము చెల్లించాల్సి ఉంటుందని గుర్తించుకోండి.

ఇప్పటివరకు SBI ATM నుండి అదనపు లావాదేవీలకు రూ. 21 + GST ​​వసూలు చేసేది. కానీ నిబంధనలను మార్చిన తర్వాత మీరు మరొక బ్యాంకు ఏటీఎం నుండి గరిష్ట లావాదేవీ పరిమితిని దాటితే మీరు మరిన్ని ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. కొత్త నిబంధనల ప్రకారం.. మీరు ఎన్ని లావాదేవీలను ఉచితంగా పొందుతారు? ప్రతి లావాదేవీకి మీరు ఎంత రుసుము చెల్లించాలి అనే దాని గురించి తెలుసుకుందాం.

SBI నిబంధనలలో ఈ మార్పు:

పొదుపు ఖాతాలలో సగటు నెలవారీ బ్యాలెన్స్ (AMB) ఆధారంగా పొదుపు ఖాతాలపై ఏటీఎం ఉచిత లావాదేవీల పరిమితిని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మార్చింది. కొత్త నిబంధన ప్రకారం.. మెట్రో, నాన్-మెట్రోలోని అన్ని ఖాతాదారులకు ప్రతి నెలా SBI ATMలలో 5 లావాదేవీలు, ఇతర బ్యాంకు ATMలలో 10 లావాదేవీలు లభిస్తాయి.

దీనితో పాటు, 25 నుండి 50 వేల మధ్య AMB ఉన్న ఖాతాదారులకు అదనంగా 5 లావాదేవీలు లభిస్తాయి. అదనంగా రూ. 50,000 నుండి రూ. లక్ష వరకు ఏఎంబీ ఉన్న కస్టమర్లకు 5 అదనపు లావాదేవీలు లభిస్తాయి. దీనితో పాటు ఏఎంబీ రూ.లక్ష కంటే ఎక్కువ ఉన్న కస్టమర్లకు అపరిమిత ఉచిత లావాదేవీల సౌకర్యం లభిస్తుంది.

ఆర్థికేతర లావాదేవీలపై ఛార్జీలు:

బ్యాలెన్స్ విచారణ, మినీ స్టేట్‌మెంట్ మొదలైన సేవలకు, ఎస్‌బీఐ ఏటీఎంలలో ఎటువంటి ఛార్జీలు లేవు. అయితే మీరు ఇతర బ్యాంకుల ఏటీఎంలలో ఇలా చేస్తే, ప్రతి లావాదేవీకి మీకు రూ.10 + GST ​చెల్లించాల్సి ఉంటుంది. మీ పొదుపు ఖాతాలో తగినంత నిధులు లేనందున మీ ఏటీఎం లావాదేవీ విఫలమైతే, ఇప్పటికే వర్తించే విధంగా జరిమానా రూ. 20 + GST ​​అలాగే ఉంటుంది.

ఎస్‌బీఐ ఎంత ఛార్జీని పెంచింది?

మే 1, 2025 నుండి అమలులోకి వచ్చే ATM ఇంటర్‌చేంజ్ రుసుమును రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) పెంచింది. ఆర్బీఐ ప్రకారం.. ఇప్పుడు బ్యాంకులు మే 1, 2025 నుండి గరిష్ట ఏటీఎం ఉపసంహరణ ఛార్జీని ప్రతి లావాదేవీకి రూ.23కి పెంచవచ్చు. ఎస్‌బీఐ కూడా ఏటీఎం నుండి అదనపు లావాదేవీలు చేస్తే, వారు కూడా ప్రతి లావాదేవీకి రూ.23 చెల్లించాల్సి ఉంటుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Leave a Comment

Subscribe for notification
Verified by MonsterInsights