RRB NTPC Examination 2025 : ఆర్‌ఆర్‌బీ ఎన్‌టీపీసీ జాబ్‌ మీ లక్ష్యమా? అయితే ఈ అంశాలు టార్గెట్‌ చేయండి!

Written by RAJU

Published on:

RRB NTPC Exam 2025 Schedule : త్వరలో ఆర్‌ఆర్‌బీ ఎన్‌టీపీసీ ఎగ్జామ్‌ డేట్‌ 2025 వెల్లడి కానుంది. మే నెలలో పరీక్ష ఉంటుందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే..

Samayam Teluguఆర్‌ఆర్‌బీ ఎన్‌టీపీసీ ఎగ్జామ్‌ 2025
ఆర్‌ఆర్‌బీ ఎన్‌టీపీసీ ఎగ్జామ్‌ 2025

RRB NTPC Exam Date 2025 : ప్రస్తుతం బాగా క్రేజ్‌ ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలు రైల్వే ఉద్యోగాలు ఖచ్చితంగా టాప్‌ 5లో ఉంటాయి. ముఖ్యంగా ఆర్‌ఆర్‌బీ ఎన్‌టీపీసీ ఉద్యోగాలకున్న క్రేజే వేరే లెవల్‌. అయితే.. ఇటీవల రైల్వేశాఖ (Indian Railway) 11,558 పోస్టుల భర్తీకి ఆర్‌ఆర్‌బీ ఎన్టీపీసీ (RRB NTPC) గ్రాడ్యుయేట్, అండర్ గ్రాడ్యుయేట్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఇందులో 8,113 గ్రాడ్యుయేట్, 3,445 అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులు ఉన్నాయి. ఇందులో చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్, స్టేషన్ మాస్టర్, గూడ్స్ ట్రైన్ మేనేజర్, అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్, ట్రైన్స్ క్లర్క్ తదితర పోస్టులు ఉన్నాయి. ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ సైతం ముగిసింది.

దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులంతా పరీక్ష తేదీల కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. అయితే.. మే/ జూన్‌ నెలలో RRB NTPC Exam 2025 నిర్వహించే అవకాశం ఉంది. త్వరలో పరీక్ష తేదీలు వెల్లడి కానున్నాయి. ఆర్‌ఆర్‌బీ ఎన్‌టీపీసీ అంటే.. రైల్వే రిక్రూట్‌మెంట్‌ బోర్డ్‌ నాన్‌ టెక్నికల్‌ పాపులర్‌ కేటగిరీస్‌ ఎగ్జామ్‌. రైల్వే రిక్రూట్‌మెంట్‌ బోర్డు.. మొదట నిర్వహించేది స్టేజ్‌–1 పరీక్ష. అభ్యర్థులు ఈ విలువైన సమయాన్ని సమర్థంగా వినియోగించుకుంటే పరీక్షలో విజయం సాధించవచ్చు. ఈ నేపథ్యంలో.. ఆర్‌ఆర్‌బీ ఎన్‌టీపీసీ ఎగ్జామ్‌ టిప్స్‌..

ఆర్‌ఆర్‌బీ ఎన్‌టీపీసీ పరీక్షను దేశవ్యాప్తంగా నిర్వహిస్తారు. ఈ పరీక్ష ద్వారా అసిస్టెంట్‌ స్టేషన్‌ మాస్టర్, కమర్షియల్‌ అప్రెంటిస్, ట్రైన్స్‌ క్లర్క్, జూనియర్‌ టైమ్‌ కీపర్, అకౌంట్స్‌ క్లర్క్‌ కమ్‌ టైపిస్ట్, ట్రాఫిక్‌ అసిస్టెంట్, ట్రాఫిక్‌ అప్రెంటిస్, గూడ్స్‌ గార్డ్‌ మొదలైన ఉద్యోగాలను భర్తీ చేస్తారు. ఇంటర్మీడియెట్‌ (10+2) ఉత్తీర్ణులు, గ్రాడ్యుయేట్స్‌ ఈ పరీక్ష దరఖాస్తుకు అర్హులు. వయసు 18 ఏళ్ల నుంచి 33 ఏళ్ల మధ్య ఉండాలి.

RRB NTPC ఎంపిక విధానం

ఆర్‌ఆర్‌బీ ఎన్‌టీపీసీ పోస్టులకు మొత్తం నాలుగు దశల్లో ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. తొలుత సీబీటీ (కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌)-1, ఆ తర్వాత సీబీటీ (కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌)- 2, స్కిల్‌ టెస్ట్, డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌ ద్వారా తుది ఎంపిక నిర్వహిస్తారు. ఆర్‌ఆర్‌బీ ఎన్‌టీపీసీ టెస్ట్‌ను ఆన్‌లైన్‌ విధానంలో నిర్వహించనున్నారు. మొదట జరిగేది పరీక్ష స్టేజ్‌–1 ఎగ్జామ్‌. ఇందులో అర్హత సాధించిన వారిని రెండో దశ (స్టేజ్‌–2)కు ఎంపిక చేస్తారు. రెండో దశ పరీక్ష సైతం ఆన్‌లైన్‌ విధానంలోనే ఉంటుంది. ఆ తర్వాత టైపింగ్‌ స్కిల్‌ టెస్ట్‌/ కంప్యూటర్‌ ఆధారిత అప్టిట్యూడ్‌ టెస్ట్, డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌/ మెడికల్‌ ఎగ్జామినేషన్‌ ఉంటాయి.

RRB NTPC స్టేజ్‌–1 పరీక్ష

ఆర్‌ఆర్‌బీ ఎన్‌టీపీసీ తొలి దశ పరీక్ష 100 ప్రశ్నలు– 100 మార్కులకు జరుగుతుంది. ఇందులో మ్యాథమెటిక్స్‌ 30 ప్రశ్నలు–30 మార్కులు, జనరల్‌ ఇంటెలిజెన్స్‌ అండ్‌ రీజనింగ్‌ 30 ప్రశ్నలు–30 మార్కులు, జనరల్‌ అవేర్‌నెస్‌ 40 ప్రశ్నలు–40 మార్కులకు ఉంటాయి. పరీక్ష సమయం 90 నిమిషాలు. స్టేజ్‌1లో అర్హత సాధించిన వారిని స్టేజ్‌2కు అనుమతిస్తారు. అయితే.. సీబీటీ స్టేజ్‌ 1 క్రాక్‌ చేయాలంటే అర్థమెటిక్‌, రీజనింగ్‌ మంచి స్కోరింగ్‌ విభాగాలు. ఈ అంశాలు కొంచెం జాగ్రత్తగా ప్రిపేరయితే మంచి స్కోర్‌ చేయొచ్చని నిపుణులు చెబుతున్నారు.

RRB NTPC స్టేజ్‌– 2 పరీక్ష

రెండో దశ పరీక్ష 120 ప్రశ్నలు–120 మార్కులకు నిర్వహిస్తారు. ఇందులో మ్యాథమెటిక్స్‌ 35 ప్రశ్నలు–35 మార్కులు, రీజనింగ్‌ 35 ప్రశ్నలు–35 మార్కులు, జనరల్‌ ఇంటెలిజెన్స్‌ అండ్‌ జనరల్‌ అవేర్‌నెస్‌ 50 ప్రశ్నలు–50 మార్కులకు పరీక్ష ఉంటుంది. పరీక్ష సమయం 90 నిమిషాలు. నెగిటివ్‌ మార్కుల విధానం ఉంది. ప్రతి తప్పు సమాధానినికి 1/3 మార్కు కోత విధిస్తారు. ఈ విషయాన్ని అభ్యర్థులు గమనించాల్సి ఉంటుంది. ఇందులోనూ అర్హత సాధించిన వారిని టైపింగ్‌ స్కిల్‌ టెస్ట్‌/ కంప్యూటర్‌ ఆధారిత అప్టిట్యూడ్‌ టెస్ట్, డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌/ మెడికల్‌ ఎగ్జామినేషన్‌కు ఆహ్వానిస్తారు.RRB NTPC Exam Date 2025 : ఆర్‌ఆర్‌బీ ఎన్‌టీపీసీ జాబ్‌ మీ లక్ష్యమా? అయితే అర్థమెటిక్, రీజనింగ్‌ టార్గెట్‌ చేయండి!

కిషోర్‌ రెడ్డి

రచయిత గురించికిషోర్‌ రెడ్డికిషోర్‌ రెడ్డి డైనమిక్ రైటర్, డిజిటల్ మీడియా ప్రొఫెషనల్. ఈ రంగంలో 6.8 సంవత్సరాల అనుభవం ఉంది. అతను డిజిటల్ మీడియాలో తన ప్రస్థానం ప్రారంభించినప్పటి నుంచి రాజకీయ, సినిమా, విద్య, ఉద్యోగాలు సహా అనేక విభాగాలను నిర్వహించడంలో గణనీయమైన నైపుణ్యాన్ని పొందారు.
రాయడంలో అతనికున్న అభిరుచి, కరెంట్ అఫైర్స్‌పై లోతైన జ్ఞానంతో కిషోర్‌ ఈ పరిశ్రమలో తనకంటూ ఒక పేరు తెచ్చుకున్నారు. విభిన్న విభాగాలలోని పాఠకులకు ఆకర్షణీయమైన సందేశాత్మక కంటెంట్‌ను రూపొందించారు. ప్రస్తుతం అతను పనిచేస్తున్న విభాగంలో.. 4.5 ఏళ్లుగా నిర్దిష్ట విభాగాన్ని నిర్వహిస్తున్నారు. అతను వ్యూవర్స్‌కు నచ్చే అత్యంత నాణ్యమైన కంటెంట్‌ను స్థిరంగా అందిస్తున్నారు.
కిషోర్‌ ఖాళీగా ఉన్నప్పుడు పుస్తకాలు చదవడం, ప్రముఖుల ఇంటర్వ్యూలు చూడటం వంటివి చేస్తుంటారు. ఈ పనులు తనను రిలాక్స్ చేస్తాయని, క్రియేటివిటీని రీఛార్జ్‌ చేస్తాయని అతను నమ్ముతున్నాడు.
… ఇంకా చదవండి

Leave a Comment

Subscribe for notification
Verified by MonsterInsights