ఇంటర్నెట్ డెస్క్: ఉద్యోగార్థులకు ఓ గుడ్ న్యూస్. 9 వేల టెక్నీషియన్ పోస్టుల భర్తీకి రైల్వే తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది. అభ్యర్థులు మార్చి 9 నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు. అప్లికేషన్లు సబ్మిట్ చేసేందుకు చివరి తేది ఏప్రిల్ 8.
వివరాలు..
-
టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్ -1100 పోస్టులు
-
టెక్నీషియన్ గ్రేడ్ 3 -7900 పోస్టులు
ఎంపిక ప్రక్రియ
అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ నాలుగు దశల్లో నిర్వహిస్తారు. తొలి రెండు దశలు కంప్యూటర్ ఆధారిత పరీక్షలు (సీబీటీ టెస్టులు). మూడో దశలో డాక్యుమెంట్ల వెరిఫికేషన్, నాలుగో దశలో మెడికల్ టెస్టు ఉంటుంది.
సీబీటీ స్టేజ్ 1 పరీక్ష: జనరల్ ఎవేర్నెస్, మ్యాథ్స్, రీజనింగ్, బేసిక్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ సబ్జెక్టులు ఉంటాయి.
సీబీటీ స్టేజ్ 2: ఇందులో రెండు భాగాలు ఉంటాయి.
-
పార్ట్ ఏ: జనరల్ ఎవేర్నెస్, మ్యాథ్స్, రీజనింగ్
-
పార్ట్ బీ: సబ్జెక్ట్ సంబంధిత టెక్నికల్ ప్రశ్నలు
ఈ రెండు పరీక్షల్లో పాసైన అభ్యర్థులకు డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ నిర్వహిస్తారు.
అప్లికేషన్ ఫీజు
-
జనరల్ అభ్యర్థులు (పురుష అభ్యర్థులు) – రూ.500
-
ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్మెన్, పీడబ్ల్యూడీ (పురుష అభ్యర్థులు) – రూ.250
-
ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, ఎక్స్సర్వీస్మెన్, పీడబ్ల్యూడీ (మహిళా/ ట్రాన్స్జెండర్ అభ్యర్థులు ) – రూ.250
-
ఆన్లైన్లో చెల్లింపు
Updated Date – Feb 13 , 2024 | 08:04 PM