Omar Abdullah In Pakistan Probe Supply Into Pahalgam Terrorist Assault

Written by RAJU

Published on:

  • పహల్గాంలో టూరిస్టులపై ఉగ్రదాడిలో తటస్థ విచారణకు సిద్ధం: పాక్ ప్రధాని
  • పాకిస్తాన్ ప్రధాని వ్యాఖ్యలపై తీవ్రంగా మండిపడిన జమ్మూ సీఎం ఒమర్ అబ్దుల్
  • పాక్ ప్రధాని కామెంట్స్ ను పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు: ఒమర్ అబ్దుల్
Omar Abdullah In Pakistan Probe Supply Into Pahalgam Terrorist Assault

Omar Abdullah: పహల్గాంలో టూరిస్టులపై ఉగ్రదాడిపై తటస్థ దర్యాప్తునకు తాము సిద్ధంగా ఉన్నామని పాక్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ ప్రకటించారు. దీనిపై జమ్మూ కాశ్మీర్‌ ముఖ్యమంత్రి ఒమర్‌ అబ్దుల్లా తీవ్రంగా మండిపడ్డారు. ఆ పాశవిక సంఘటనను తొలుత పాకిస్థాన్‌ తోసిపుచ్చి.. ఆ ఘటన వెనక భారత్‌ ఉందని తొలుత ఆరోపించింది అన్నారు. మనపై ఆరోపణలు చేయడంలో ముందు ఉండే వాళ్లకు ఇప్పుడేం చెప్పలేం అన్నారు. పాక్ ప్రకటనలకు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వాలని అనుకోవడం లేదన్నారు. ఈ దురదృష్టకరమైన ఘటన జరిగి ఉండాల్సింది కాదని సీఎం ఒమర్‌ అబ్దుల్లా పేర్కొన్నారు.

Read Also: KKR vs PBKS: ప్రభ్‌సిమ్రాన్ సింగ్, ప్రియాన్ష్ ఊచకోత.. కోల్‌కతా ముందు భారీ టార్గెట్

అయితే, పాకిస్థాన్‌లోని ఖైబర్‌ పఖ్తుంఖ్వాలోని మిలిటరీ అకాడమీ గ్రాడ్యుయేషన్‌ వేడుకల్లో పాల్గొన్న ప్రధాన మంత్రి షెహబాజ్‌ షరీఫ్‌.. తాజాగా నెలకొన్న ఉద్రిక్తతలపై స్పందించారు. పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి ఘటనతో మరోసారి మన దేశం నిందలు ఎదుర్కుంటోందని వ్యాఖ్యనించారు. ఆ ఘటనపై తటస్థ, పారదర్శక, విశ్వసనీయ విచారణలో పాల్గొనేందుకు తాము సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. శాంతికే మా మొది ప్రాధాన్యం అని చెప్పుకొచ్చారు. ఉగ్రవాదాన్ని తాము కూడా ఖండిస్తామంటూ పాక్ పీఎం షెహబాజ్ షరీఫ్ పేర్కొనడంపై జమ్మూ కశ్మీర్‌ ముఖ్యమంత్రి విమర్శలు గుప్పించారు.

Leave a Comment

Subscribe for notification
Verified by MonsterInsights