మార్చి నెల ముగిసింది. ఏప్రిల్ నెల వచ్చేస్తోంది. అయితే ఏప్రిల్ 1 నుండి అనేక నియమాలు అమలు కానున్నాయి. ఇది మీ జేబుపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది. ఈ మార్పులలో క్రెడిట్ కార్డులకు సంబంధించిన అప్డేట్లు, పొదుపు ఖాతాలకు సంబంధించిన నియమాలు, ఏటీఎంల నుండి డబ్బు ఉపసంహరించుకునే ఛార్జీలు, అనేక ఇతర మార్పులు ఉన్నాయి. మీరు ఈ ముఖ్యమైన మార్పులను విస్మరిస్తే, తరువాత మీరు నష్టాలను చవిచూడాల్సి రావచ్చు.
1 గ్యాస్ ధరలు:
నిత్యావసర వస్తువుల్లో ఒకటైన గ్యాస్ సిలిండర్ ధరలు అంతర్జాతీయ ముడి చమురు ధరలపై ఆధారపడి ఉంటాయి. ఈ ధరలను ప్రతి నెల ఒకటో తేదీన సవరిస్తుంటారు. ప్రతి నెలా 1వ తేదీ రాగానే ధరలు తగ్గుముఖం పడతాయోమోనని సామాన్య ప్రజలు కొండంత ఆశతో ఎదురుచూస్తారు. అయితే ఏప్రిల్లో 1న గ్యాస్ ధరల్లో మార్పులు ఉండే అవకాశం ఉంది.
2. RuPay డెబిట్ కార్డులో మార్పు:
నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఏప్రిల్ 1, 2025 నుండి అమలు చేయనున్న రూపే డెబిట్ సెలెక్ట్ కార్డ్కు సంబంధించి పెద్ద మార్పులు చేయబోతోంది. ప్రజల ఆధునిక అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ కార్డును రూపొందించారు. ఇందులో ప్రయాణం, ఫిట్నెస్, వెల్నెస్, ఇతర అవసరాలు కూడా ఉన్నాయి. విమానాశ్రయ లాంజ్ యాక్సెస్, బీమా కవర్కు సంబంధించిన మార్పులు కూడా ఉంటాయి.
3. బ్యాంకు కనీస బ్యాలెన్స్:
ఎస్బీఐ, పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఇతర బ్యాంకులు కూడా తమ కనీస బ్యాలెన్స్ నియమాలను మార్చబోతున్నాయి. ఖాతాలో నిర్వహించాల్సిన కనీస బ్యాలెన్స్ మీ ఖాతా ఉన్న సెమీ అర్బన్, గ్రామీణ లేదా నగరంపై ఆధారపడి ఉంటుంది. నిర్దేశించిన కనీస బ్యాలెన్స్ను నిర్వహించనందుకు మీరు జరిమానా చెల్లించాల్సి రావచ్చు.
4. పాజిటివ్ పే సిస్టమ్ (PPS) అమలు:
లావాదేవీ భద్రతను పెంచడానికి, అనేక బ్యాంకులు పాజిటివ్ పే సిస్టమ్ (PPS) ను ప్రవేశపెడుతున్నాయి. రూ.5,000 కంటే ఎక్కువ చెక్కు చెల్లింపులకు ఈ వ్యవస్థకు ధృవీకరణ అవసరం. ప్రాసెస్ చేయడానికి ముందు కస్టమర్లు చెక్ నంబర్, తేదీ, చెల్లింపుదారు పేరు, మొత్తం వంటి వివరాలను నిర్ధారించాలి. తద్వారా మోసం, లోపాలను తగ్గించవచ్చు.
5. FD వడ్డీ రేట్లలో మార్పులు:
ఇది కాకుండా, చాలా బ్యాంకులు తమ ఎఫ్డీ, పొదుపు ఖాతాల వడ్డీ రేట్లను మార్చవచ్చు. సేవింగ్స్ ఖాతా వడ్డీ ఇప్పుడు ఖాతా బ్యాలెన్స్పై ఆధారపడి ఉంటుంది. అంటే అధిక బ్యాలెన్స్లు మెరుగైన రేట్లను అందిస్తాయి. డిజిటల్ విప్లవం తీసుకురావడానికి, బ్యాంకులు వినియోగదారులకు అందించే ఆన్లైన్, మొబైల్ బ్యాంకింగ్ సేవలను అప్గ్రేడ్ చేస్తున్నాయి.
6. బ్యాంకులు AI సహాయం:
కస్టమర్ల ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి అనేక బ్యాంకులు AI చాట్బాట్లను ఉపయోగిస్తున్నాయి. డిజిటల్ లావాదేవీలను మరింత సురక్షితంగా చేయడానికి, బయోమెట్రిక్ ధృవీకరణ, రెండు-కారకాల ధృవీకరణ వంటి సేవలు ఏప్రిల్ 1 నుండి AI సహాయంతో మరింత బలోపేతం చేయనున్నట్లు తెలుస్తోంది.
7. సవరించిన క్రెడిట్ కార్డ్ ప్రయోజనాలు:
SBI, IDFC ఫస్ట్ బ్యాంక్ వంటి ప్రధాన బ్యాంకులు తమ కో-బ్రాండెడ్ విస్తారా క్రెడిట్ కార్డులను మారుస్తున్నాయి. టికెట్ వోచర్లు, పునరుద్ధరణ ప్రోత్సాహకాలు, రివార్డులు వంటి ప్రయోజనాలు నిలిపివేయనున్నాయి. యాక్సిస్ బ్యాంక్ ఏప్రిల్ 18 నుండి ఇలాంటి మార్పులను అమలు చేస్తుంది. ఇది దాని విస్తారా క్రెడిట్ కార్డ్ హోల్డర్లను ప్రభావితం చేస్తుంది.
8. కార్ల ధరలు:
ఏప్రిల్ 1 నుండి అనేక ప్రధాన ఆటోమొబైల్ తయారీదారులు తమ కార్ల ధరలను పెంచుతున్నారు. మారుతి ధరలు 4 శాతం వరకు పెరుగుతున్నాయి. హ్యుందాయ్, మహీంద్రా, టాటా మోటార్స్, రెనాల్ట్, కియా వంటి కంపెనీలు 2 నుంచి 4 శాతం వరకు ధరలు పెంచవచ్చు.
9. జిఎస్టిలో ఎంఎఫ్ఎ నియమాలు:
ఏప్రిల్ 1 నుండి ఇన్పుట్ టాక్స్ డిస్ట్రిబ్యూటర్ సిస్టమ్ (ISD) అమలు చేయనున్నారు. ఈ వ్యవస్థ కింద వ్యాపారాలు ఇన్పుట్ టాక్స్ క్రెడిట్ (ITC) కోసం నమోదు చేసుకోవడం తప్పనిసరి. గతంలో వ్యాపారవేత్తలకు ICTగా నమోదు చేసుకోవాలా వద్దా అనే ఎంపిక ఉండేది. ఇప్పుడు ఒక వ్యాపారి దానిని ఉపయోగించకపోతే ఐటీసీ అందించరు. నిబంధనలను ఉల్లంఘిస్తే రూ.10,000 వరకు జరిమానా విధించవచ్చు.
10. టీడీఎస్ నిబంధనలలో కూడా మార్పులు:
కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన తర్వాత ఇప్పుడు ఏప్రిల్ 1, 2025 నుండి ఆర్థిక సంవత్సరం ప్రారంభం కానున్నందున పన్ను మినహాయింపు (TDS), మూలం వద్ద పన్ను వసూలు (TCS) నియమాలలో మార్పు రాబోతోంది.
ఇది కూడా చదవండి: Mukesh Ambani House: అంబానీ ఇంటి విద్యుత్ బిల్లు ఎంత వస్తుందో తెలిస్తే మతిపోతుంది!
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి