Mulugu District : ములుగు ఏజెన్సీలో పేలిన ప్రెషర్ బాంబ్ – మావోయిస్టులు అమర్చిందేనా..?

Written by RAJU

Published on:

వీరభద్రవరం వరకు మోసుకొచ్చి..

ప్రెషర్ బాంబు పేలిన ఘటనలో తీవ్రంగా గాయపడిన కృష్ణమూర్తి అక్కడికక్కడే కుప్పకూలగా, మిగతా వాళ్లు అదృష్టావశాత్తు క్షేమంగా బయటపడ్డారు. అప్పటికే అటవీ ప్రాంతం మధ్య వరకు వెళ్లగా, కృష్ణమూర్తికి తీవ్ర గాయాలతో రక్త స్రావం జరుగుతోంది. దీంతో మిగతా యువకులు రెండు కాళ్లకు కట్లు కట్టి…. వెంటనే 108 అంబులెన్స్ కు సమాచారం అందించారు. కానీ వారు అటవీ ప్రాంతం మధ్యలో ఉండటంతో కృష్ణమూర్తిని వీరభద్రవరం వరకు మోసుకుని వచ్చారు. అంతకుముందే సమాచారం ఇవ్వడంతో 108 అంబులెన్స్ వీరభద్రవరం గ్రామానికి చేరుకుని ఉండగా…. అందులో కృష్ణమూర్తిని ములుగు ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Subscribe for notification