ఐపీఎల్ 2025లో ముంబై ఇండియన్స్ (MI) వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) మ్యాచ్ వాంఖడే స్టేడియంలో జరుగుతోంది. ముంబై టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. జస్ప్రీత్ బుమ్రా ఈ సీజన్లో తొలి మ్యాచ్ ఆడబోతున్నాడు. రోహిత్ శర్మ కూడా తిరిగి వచ్చాడు. గత మ్యాచ్లో ప్లేయింగ్-11లో బెంగళూరు ఎలాంటి మార్పులు చేయలేదు.
ఈ సీజన్లో తొలి 4 మ్యాచ్ల్లో 3 మ్యాచ్ల్లో ముంబై ఓటమి పాలైంది. బెంగళూరు 3 మ్యాచ్ల్లో 2 గెలిచి, 1 మ్యాచ్లో ఓడిపోయింది. వాంఖడేలో ముంబైపై బెంగళూరు 10 సంవత్సరాలుగా గెలవలేదు. ఆ జట్టు చివరిసారిగా 2015లో ఇక్కడ గెలిచింది.
ఇరుజట్ల ప్లేయింగ్ 11..
ముంబై ఇండియన్స్: హార్దిక్ పాండ్యా (కెప్టెన్), రియాన్ రికెల్టన్ (వికెట్ కీపర్), విల్ జాక్స్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, నమన్ ధీర్, మిచెల్ సాంట్నర్, దీపక్ చాహర్, ట్రెంట్ బౌల్ట్, జస్ప్రీత్ బుమ్రా, విఘ్నేష్ పుత్తూర్.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: రజత్ పాటిదార్ (కెప్టెన్), ఫిల్ సాల్ట్, విరాట్ కోహ్లీ, దేవదత్ పడిక్కల్, లియామ్ లివింగ్స్టోన్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), టిమ్ డేవిడ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, జోష్ హేజిల్వుడ్, యశ్ దయాల్.
రెండు జట్ల ఇంపాక్ట్ ప్లేయర్లు:
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఇంపాక్ట్ ప్లేయర్లు: రసిఖ్ దార్ సలామ్, సుయాష్ శర్మ, స్వస్తిక్ చికారా, జాకబ్ బెథెల్, స్వప్నిల్ సింగ్.
ముంబై ఇండియన్స్ ఇంపాక్ట్ ప్లేయర్లు: రోహిత్ శర్మ, కార్బిన్ బాష్, రాబిన్ మింజ్, అశ్వని కుమార్, రాజ్ బావా
మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..