Food Poison: రాజన్న సిరిసిల్ల జిల్లాలో తల్లీకొడుకులు అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం ఉద్రిక్తతకు దారి తీసింది. రుద్రంగి మండల కేంద్రానికి చెందిన కాదాను పుష్పలత (35), నిహాల్ (6), శుక్రవారం రాత్రి ఇంట్లో రొట్టెలు తిని పడుకున్నారు. అనంతరం వాంతులు విరోచనాలు కావడంతో స్థానిక ఆర్ఎంపీ వద్ద వైద్యం చేయించుకున్నారు. పరిస్థితి విషమించడంతో శనివారం కోరుట్ల, కరీంనగర్ లోని ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స పొందారు.