ABN
, Publish Date – Apr 25 , 2025 | 04:34 AM
లారస్ ల్యాబ్స్ 2023-24 ఆర్థిక సంవత్సరంలో లాభాన్ని మూడింతలు పెంచింది. మార్చితో ముగిసిన త్రైమాసికంలో రూ.234 కోట్ల నికర లాభం సాధించి, ఆదాయంలో కూడా వృద్ధి నమోదు చేసింది

హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): మార్చితో ముగిసిన చివరి త్రైమాసికంలో లారస్ ల్యాబ్స్ రూ.234 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని ఆర్జించింది. 2023-24 ఆర్థిక సంవత్సరం ఇదే కాలం (రూ.76 కోట్లు)తో పోల్చితే లాభం ఏకంగా మూడింతలు వృద్ధి చెందింది. కాగా త్రైమాసిక సమీక్షా కాలంలో కంపెనీ కన్సాలిడేటెడ్ ఆదాయం కూడా రూ.1,440 కోట్ల నుంచి రూ.1,720 కోట్లకు పెరిగింది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి లాభం రూ.161 కోట్ల నుంచి రూ.358 కోట్లకు, ఆదాయం రూ.5,041 కోట్ల నుంచి రూ.5,554 కోట్లకు పెరిగింది. కాగా కంపెనీ డైరెక్టర్ల బోర్డు 2024-25 ఆర్థిక సంవత్సరానికి రూ.2 ముఖ విలువ గల ఒక్కో షేరుపై 80 పైసల డివిడెండ్ ప్రకటించింది.
Updated Date – Apr 25 , 2025 | 04:35 AM