దేశ దిశ

Jee Fundamental Reply Key 2025 Session 2,JEE Fundamental Reply Key 2025 : త్వరలో అధికారిక జేఈఈ మెయిన్‌ సెషన్‌ 2 ఆన్సర్‌ కీ విడుదల – jee major reply key 2025 session 2 quickly at jeemain nta nic in

JEE Main Session 2 Answer Key 2025 : జేఈఈ మెయిన్‌ రెండో విడత పరీక్షలు చివరి దశకు చేరుకున్నాయి. ఈక్రమంలో అధికారిక ఆన్సర్‌ కీ విడుదలకు ఎన్‌టీఏ సిద్ధమవుతోంది.

Samayam Teluguజేఈఈ మెయిన్‌ ఆన్సర్‌ కీ 2025
జేఈఈ మెయిన్‌ ఆన్సర్‌ కీ 2025

JEE Main Answer Key 2025 Session 2 : జేఈఈ మెయిన్ 2025 సెషన్‌ 2 పరీక్షలు ఏప్రిల్‌ 2వ తేదీ నుంచి ప్రారంభమై.. ఈరోజు (ఏప్రిల్‌ 9)తో ముగియనున్నాయి. ఈ పరీక్షలు ముగిసిన తర్వాత ఒకటి రెండు రోజుల్లో ఎన్‌టీఏ జేఈఈ మెయిన్‌ ఆన్సర్‌ కీ అధికారికంగా వెల్లడించనుంది. అనంతరం ఏప్రిల్‌ 17వ తేదీన జేఈఈ మెయిన్‌ సెషన్‌ 2 రిజల్ట్‌ విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ఆన్సర్‌ కీ, ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌లో అభ్యర్థులకు వీలుగా అందుబాటులో ఉంచనుంది. పరీక్షకు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు తమ అప్లికేషన్ నెంబర్‌, పాస్‌వర్డ్ వివరాలు నమోదుచేసి ఆన్సర్‌ కీ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. డైరెక్ట్‌ లింక్ ఇదే.

Joint Entrance Examination JEE Main ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం.. ఏప్రిల్ 2, 3, 4, 7, 8 తేదీల్లో రెండు షిఫ్టుల్లో పేపర్-1 (బీఈ, బీటెక్‌) పరీక్షలు నిర్వహించారు. అదేవిధంగా.. ఏప్రిల్ 9న పేపర్‌-2 ఏ (బీఆర్క్‌), పేపర్‌-2బీ (బీ ప్లానింగ్‌), పేపర్‌-2 ఏ, 2 బీ (బీఆర్క్‌, బీ ప్లానింగ్‌ రెండింటికి) పరీక్షలు నిర్వహించారు. ఆయా తేదీల్లో మొదటి షిఫ్ట్‌ పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు నిర్వహించారు. సెకండ్‌ షిఫ్ట్‌ పరీక్షలు మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 వరకు జరిగాయి. దేశవ్యాప్తంగా 15 నగరాల్లో జేఈఈ మెయిన్ సెషన్ 2 పరీక్షలు నిర్వహించేందుకు ఎన్‌టీఏ ఏర్పాట్లు చేసింది. ఈ పరీక్షలకు అభ్యర్థులు అప్‌డేట్స్‌ కోసం అధికారిక వెబ్‌సైట్‌ https://jeemain.nta.nic.in/ చూడొచ్చు.

ఏప్రిల్‌ 23 నుంచి జేఈఈ అడ్వాన్స్‌డ్‌ 2025 రిజిస్ట్రేషన్లు
దేశవ్యాప్తంగా ఐఐటీలు, నిట్‌లు, ట్రిపుల్ ఐటీ వంటి ప్రతిష్ఠాత్మక ఇంజినీరింగ్ కాలేజీల్లో బీఈ/ బీటెక్ కోర్సుల్లో అడ్మిషన్ల కోసం నిర్వహించే జేఈఈ అడ్వాన్డ్స్‌ (Joint Entrance Examination JEE Advanced) పరీక్షల షెడ్యూల్ ఇప్పటికే విడుదలైంది. ఈ పరీక్షకు ఏప్రిల్‌ 23వ తేదీ నుంచి మే 2వ తేదీ వరకు అప్లయ్‌ చేసుకోవచ్చు. అనంతరం మే 11న హాల్‌టికెట్లు విడుదల చేస్తారు. తర్వాత 2025 మే 18వ తేదీన రెండు సెషన్లలో ఈ పరీక్ష నిర్వహిస్తారు. మే 18వ తేదీన ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ మొదటి పేపర్, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి 5.30 గంటల వరకు రెండో పేపర్ పరీక్ష నిర్వహించనున్నారు.

అనతరం మే 22న రెస్పాన్స్‌ షీట్లు, మే 26న ప్రాథమిక కీ విడుదల చేయనున్నారు. అనంతరం జూన్‌ 2న ఫైనల్‌ కీ, రిజల్ట్స్‌ విడుదల చేయనున్నారు. తర్వాత జూన్‌ 3 నుంచి జోసా కౌన్సెలింగ్‌ ప్రారంభమవుతుంది. ఐఐటీల్లో అడ్మిషన్ల కోసం అభ్యర్థులు రెండు పరీక్షలు తప్పనిసరిగా రాయాల్సిందే. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ) మోడ్‌లో పరీక్ష జరుగుతుంది. ఒక అభ్యర్థి రెండేళ్లలో గరిష్టంగా రెండు సార్లు జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్షకు హాజరు కావొచ్చు. ఈ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు టైమ్ టేబుల్‌తో పాటు ఇతర ముఖ్యమైన వివరాలను https://jeeadv.ac.in/ అధికారిక వెబ్‌సైట్‌లో చూసుకోవచ్చు.

రచయిత గురించికిషోర్‌ రెడ్డికిషోర్‌ రెడ్డి డైనమిక్ రైటర్, డిజిటల్ మీడియా ప్రొఫెషనల్. ఈ రంగంలో 6.8 సంవత్సరాల అనుభవం ఉంది. అతను డిజిటల్ మీడియాలో తన ప్రస్థానం ప్రారంభించినప్పటి నుంచి రాజకీయ, సినిమా, విద్య, ఉద్యోగాలు సహా అనేక విభాగాలను నిర్వహించడంలో గణనీయమైన నైపుణ్యాన్ని పొందారు.
రాయడంలో అతనికున్న అభిరుచి, కరెంట్ అఫైర్స్‌పై లోతైన జ్ఞానంతో కిషోర్‌ ఈ పరిశ్రమలో తనకంటూ ఒక పేరు తెచ్చుకున్నారు. విభిన్న విభాగాలలోని పాఠకులకు ఆకర్షణీయమైన సందేశాత్మక కంటెంట్‌ను రూపొందించారు. ప్రస్తుతం అతను పనిచేస్తున్న విభాగంలో.. 4.5 ఏళ్లుగా నిర్దిష్ట విభాగాన్ని నిర్వహిస్తున్నారు. అతను వ్యూవర్స్‌కు నచ్చే అత్యంత నాణ్యమైన కంటెంట్‌ను స్థిరంగా అందిస్తున్నారు.
కిషోర్‌ ఖాళీగా ఉన్నప్పుడు పుస్తకాలు చదవడం, ప్రముఖుల ఇంటర్వ్యూలు చూడటం వంటివి చేస్తుంటారు. ఈ పనులు తనను రిలాక్స్ చేస్తాయని, క్రియేటివిటీని రీఛార్జ్‌ చేస్తాయని అతను నమ్ముతున్నాడు.
… ఇంకా చదవండి

Exit mobile version