5 Records May Broken GT vs RR Match: ఈరోజు ఐపీఎల్ (IPL) 2025లో, గత కొన్ని మ్యాచ్లలో వరుసగా గెలుస్తున్న రెండు జట్లు గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడబోతున్నాయి. గుజరాత్ టైటాన్స్ వరుసగా మూడు మ్యాచ్ల్లో విజయం సాధించింది. అదే సమయంలో, రాజస్థాన్ రాయల్స్ కూడా గత రెండు మ్యాచ్లలో విజయాలను నమోదు చేసింది. అహ్మదాబాద్లో గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్మాన్ గిల్ బ్యాట్ పరుగుల వర్షం కురిపిస్తోంది. రాజస్థాన్ రెగ్యులర్ కెప్టెన్ సంజు శాంసన్ పునరాగమనం తర్వాత జట్టు బలంగా కనిపిస్తోంది.
నేటి మ్యాచ్లో ఆటగాళ్ళు సాధించాలనుకుంటున్న ఐదు రికార్డులను చూద్దాం..
5. టీ20లో 50 సిక్సర్లు కొట్టే దిశగా సాయి సుదర్శన్..
గుజరాత్ ఆటగాడు సాయి సుదర్శన్ ఐపీఎల్ 2025కి గొప్ప ఆరంభం ఇచ్చాడు. అతను గుజరాత్ తరపున 4 మ్యాచ్ల్లో 2 హాఫ్ సెంచరీలతో 191 పరుగులు చేశాడు. 2022లో గుజరాత్ ఐపీఎల్లోకి అరంగేట్రం చేసినప్పటి నుంచి, సాయి నాలుగు సీజన్లలో 1225 పరుగులు చేశాడు. సాయి 49 టీ20 మ్యాచ్ల్లో 1703 పరుగులు చేశాడు. ఇందులో 156 ఫోర్లు, 44 సిక్సర్లు ఉన్నాయి. ఇప్పుడు అతను 50 సిక్సర్లు పూర్తి చేయడానికి 6 సిక్సర్లు అవసరం.
4. నితీష్ రాణా 250 ఫోర్లు పూర్తి చేయడానికి ఇంకా 2 ఫోర్ల దూరంలో..
నితీష్ రాణా 2016లో ముంబైతో తన ఐపీఎల్ కెరీర్ను ప్రారంభించాడు. అతను 111 ఐపీఎల్ మ్యాచ్ల్లో 28.62 సగటుతో, 136 కంటే ఎక్కువ స్ట్రైక్ రేట్తో 2,748 పరుగులు చేశాడు. ఇందులో 19 హాఫ్ సెంచరీలు కూడా ఉన్నాయి. 119 మ్యాచ్ల్లో నితీష్ 248 ఫోర్లు, 137 సిక్సర్లు బాదాడు. ఇప్పుడు అతను 250 సిక్సర్లు పూర్తి చేయడానికి మరో 2 బిగ్ షాట్లు అవసరం.
3. టీ20ల్లో 200 వికెట్లకు మహిష్ తీక్షణ 4 వికెట్ల దూరంలో..
రాజస్థాన్ ఆఫ్ స్పిన్నర్ మహీష్ తీక్ష్ణ ఐపీఎల్ 2025లో నాలుగు మ్యాచ్ల్లో నాలుగు వికెట్లు పడగొట్టాడు. టీ20లో 200 వికెట్లు పూర్తి చేయడానికి తీక్షకు 4 వికెట్లు అవసరం. అతను 188 మ్యాచ్ల్లో 24.79 సగటు, 6.82 ఎకానమీ రేటుతో 196 వికెట్లు పడగొట్టాడు.
2. సంజు శాంసన్ సరికొత్త చరిత్ర..
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజు శాంసన్ ఐపీఎల్లో జట్టు తరపున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా మారగలడు. ఆర్ఆర్ తరపున సంజు 144 మ్యాచ్ల్లో 31.53 సగటు, 141.67 స్ట్రైక్ రేట్తో 3,879 పరుగులు చేశాడు. ఇందులో రెండు సెంచరీలు, 23 అర్ధ సెంచరీలు ఉన్నాయి. రాజస్థాన్ తరపున 4000 పరుగులు పూర్తి చేయడానికి సంజు శాంసన్ 121 పరుగులు చేయాలి. టీ20ల్లో 350 సిక్సర్లు పూర్తి చేయడానికి సంజుకు కేవలం 8 సిక్సర్లు మాత్రమే అవసరం. అతను 342 సిక్సర్లు, 624 ఫోర్లు కొట్టాడు.
1. శుభ్మాన్ గిల్ @ 500..
గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్మాన్ గిల్కు ఐపీఎల్ 2025 ప్రారంభం అంత ప్రత్యేకమైనది కాదు. గిల్ నాలుగు ఇన్నింగ్స్లలో 148.97 స్ట్రైక్ రేట్తో కేవలం 1346 పరుగులు మాత్రమే చేశాడు. ఇందులో ఒక అర్ధ సెంచరీ కూడా ఉంది. ఐపీఎల్లో ఆర్ఆర్పై 500 పరుగులు పూర్తి చేయడానికి గిల్కు 56 పరుగులు అవసరం. గిల్ రాజస్థాన్పై 13 ఇన్నింగ్స్లలో 444 పరుగులు చేశాడు. టీ20 క్రికెట్లో 150 సిక్సర్లు పూర్తి చేయడానికి గిల్కు ఇంకా 2 సిక్స్లు అవసరం. 149 మ్యాచ్ల్లో గిల్ 148 సిక్సర్లు, 454 ఫోర్లు బాదాడు.
నేటి GT vs RR మ్యాచ్లో నమోదయ్యే ఇతర రికార్డులు..
షిమ్రాన్ హెట్మెయర్ టీ20లో 5000 పరుగులకు 7 పరుగుల దూరంలో ఉన్నాడు. టీ20లో 350 ఫోర్లు పూర్తి చేయడానికి 5 బౌండరీల దూరంలో ఉంది.
ఐపీఎల్లో 100 ఫోర్లు పూర్తి చేయడానికి రియాన్ పరాగ్కు 10 ఫోర్లు అవసరం.
షెర్ఫేన్ రూథర్ఫోర్డ్ 200 టీ20 ఫోర్లు పూర్తి చేయడానికి 10 ఫోర్లు అవసరం.
ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్ తరఫున 500 పరుగులు పూర్తి చేయడానికి రాహుల్ తెవాటియా 2 అడుగులు దూరంలో ఉన్నాడు.
ఐపీఎల్లో 500 పరుగులు పూర్తి చేయడానికి ధ్రువ్ జురెల్ ఇంకా 34 పరుగుల దూరంలో ఉన్నాడు.
మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..