IPL 2025: ఇవెక్కడి రూల్స్.. 9 రోజుల్లో బలైన ఐదుగురు.. ప్లేయర్లను భయపెడుతోన్న బీసీసీఐ

Written by RAJU

Published on:


Indian Premier League 2025: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2025) సీజన్-18 ప్రారంభమై 2 వారాలు గడించింది. ఈ రెండు వారాల్లో మొత్తం 19 మ్యాచ్‌లు జరిగాయి. ఈ పంతొమ్మిది మ్యాచ్‌లలో ఐపీఎల్ నియమాలను ఉల్లంఘించినందుకు ఐదుగురు ఆటగాళ్లకు జరిమానా విధించారు. ముఖ్యంగా ఒక ఆటగాడికి కేవలం రెండు వారాల్లో రెండుసార్లు జరిమానా విధించారు. ఇప్పటివరకు ఐపీఎల్‌లో జరిమానాకు గురైన ఆటగాళ్లందరినీ పరిశీలిస్తే..

హార్దిక్ పాండ్యా: మార్చి 30న గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌కు నాయకత్వం వహించిన హార్దిక్ పాండ్యాకు రూ.12 లక్షలు జరిమానా విధించారు. అహ్మదాబాద్‌లో జరిగిన మ్యాచ్‌లో పాండ్యా స్లో ఓవర్ వేసినందుకు శిక్షకు గురయ్యాడు.

రియాన్ పరాగ్: సంజు శాంసన్ స్థానంలో రాజస్థాన్ రాయల్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరించిన రియాన్ పరాగ్‌ కూడా జరిమానాకు గురయ్యాడు. చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో స్లో ఓవర్ రేట్ తప్పు చేసినందుకు పరాగ్‌కు రూ.12 లక్షల జరిమానా విధించారు.

రిషబ్ పంత్: లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ రిషబ్ పంత్‌కు కూడా జరిమానా పడింది. ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్ లో పంత్ నిర్ణీత సమయంలోపు 20 ఓవర్లు పూర్తి చేయకపోవడంతో అతనికి రూ.12 లక్షల జరిమానా విధించారు.

ఇషాంత్ శర్మ: గుజరాత్ టైటాన్స్ సీనియర్ పేసర్ ఇషాంత్ శర్మ కూడా శిక్ష అనుభవించాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో ఐపీఎల్ నిబంధనలను ఉల్లంఘించినందుకు అతనికి మ్యాచ్ ఫీజులో 10% అంటే, 25 శాతం జరిమానా విధించారు.

దిగ్వేష్ రాఠీ: లక్నో సూపర్ జెయింట్స్ యువ స్పిన్నర్ దిగ్వేష్ రాఠీకి ఇప్పటికే రెండుసార్లు జరిమానా పడింది. పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ప్రియాంష్ ఆర్యను అవుట్ చేసిన తర్వాత నోట్‌బుక్ వేడుక చేసుకున్నాడు. దీంతో దిగ్వేష్‌కు మ్యాచ్ ఫీజులో 25% జరిమానా విధించారు. అలాగే, ఒక డీమెరిట్ పాయింట్ ఇచ్చారు. ఆ తర్వాత, ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో దిగ్వేష్ రతి మరో నోట్‌బుక్ వేడుకతో కనిపించాడు. ఈసారి ఐపీఎల్ నిబంధనలను ఉల్లంఘించినందుకు దిగ్వేష్‌కు అతని మ్యాచ్ ఫీజులో 50% జరిమానాతోపాటు 2 డీమెరిట్ పాయింట్లు విధించారు.

మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Subscribe for notification
Verified by MonsterInsights