IPL ఫీవర్‌.. జియో నుంచి అదిరిపోయే ప్లాన్‌! క్రికెట్‌ ఫ్యాన్స్‌కు పండగే

Written by RAJU

Published on:


మరికొన్ని రోజుల్లో ఐపీఎల్‌ 2025 సీజన్‌ ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఇప్పటికే తమ తమ అభిమాన టీమ్స్‌లో ఎవరెవరు ఉన్నారు? మ్యాచ్‌లు ఎప్పుడెప్పుడు ఉన్నాయ్‌? ప్లేయింగ్‌ ఎలెవన్‌ ఎలా ఉండబోతుంది అంటూ క్రికెట్‌ ఫ్యాన్స్‌ ఐపీఎల్‌ ఫీవర్‌తో ఊగిపోతున్నారు. ఈ క్రమంలో జియో క్రికెట్‌ అభిమానుల కోసం అదిరిపోయే ప్లాన్‌ తీసుకొచ్చింది. ఐపీఎల్‌ మ్యాచ్‌లు జియో హాట్‌స్టార్‌లోనే లైవ్‌ స్ట్రీమింగ్‌ కానున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తన కస్టమర్ల కోసం ప్రత్యేకమైన అన్‌లిమిటెడ్ క్రికెట్ ఆఫర్‌ను ప్రవేశపెట్టింది జియో.

ఈ పరిమిత కాల ఆఫర్ మార్చి 17 నుంచి మార్చి 31 మధ్య అందుబాటులో ఉంటుంది. కేవలం రూ.299 రీఛార్జ్‌తో ఈ ప్లాన్‌ వర్తిస్తుంది. ఈ ఆఫర్‌తో, క్రికెట్ అభిమానులు టీవీ, మొబైల్‌లో 4Kలో 90 రోజుల ఉచిత జియోహాట్‌స్టార్ స్ట్రీమింగ్‌ను ఆస్వాదించవచ్చు. అలాగే 800+ టీవీ ఛానెల్‌లు, 11+ OTT యాప్‌లు, అపరిమిత వైఫై, 4K స్ట్రీమింగ్ అనుభవాన్ని అందించే జియోఫైబర్ లేదా జియోఎయిర్ ఫైబర్ 50 రోజుల ఉచిత ట్రయల్‌ను అనుభవించవచ్చు. ప్రస్తుత జియో వినియోగదారులు ₹299 లేదా అంతకంటే ఎక్కువ ప్లాన్‌తో రీఛార్జ్ చేసుకోవడం ద్వారా ఈ ఆఫర్‌ను యాక్టివేట్ చేసుకోవచ్చు.

మార్చి 17కి ముందు రీఛార్జ్ చేసుకున్న వారు ₹100 యాడ్-ఆన్ ప్యాక్‌ను ఎంచుకోవడం ద్వారా ప్రయోజనాలను పొందవచ్చు. కొత్త వినియోగదారులు అదే ₹299 ప్లాన్‌తో జియో సిమ్‌ను పొందవచ్చు, ఈ ప్రయోజనాలన్నింటినీ ఆస్వాదించవచ్చు. ఐపీఎల్‌ ప్రారంభ మ్యాచ్‌తో సమానంగా మార్చి 22, 2025 నుండి జియో హాట్‌స్టార్ ప్యాక్ యాక్టివేట్ అవుతుంది. మరిన్ని వివరాల కోసం సమీపంలోని జియో స్టోర్‌ను సందర్శించవచ్చు లేదా jio.comలో చూడొచ్చు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఒక్కడ క్లిక్ చేయండి.

Subscribe for notification