పోలీసుల విచారణతో వెలుగులోకి…
రాంప్రసాద్ పిర్యాదుతో ఏఎస్పీ శేషాద్రిని రెడ్డి నేతృత్వంలో పోలీసులు రంగంలోకి దిగగా విదేశాల నుంచి అక్రమంగా బంగారం తరలించడమే కాకుండా కాజేశారనే విషయం బయటపడింది. చందుర్తి మండలం తొంటి బీరయ్య, గడ్డం అనీల్ ను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. మోసానికి తెరలేపిన ఏ1 కాల్వ వెంకటేశ్ సౌదీలో ఉండగా, విదేశీ బంగారంతో ఉడాయించిన ఏ2 నాగరాజు ప్రస్తుతం పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు.