ఛార్జీలను ఖరారు చేసిన ప్రభుత్వం
వాహనాల నంబర్ ప్లేట్లను మార్చాలని ఆదేశించిన ప్రభుత్వం కొత్త రిజిస్ట్రేషన్ ప్లేట్ ఛార్జిలను కూడా ఖరారు చేసింది. వాహనం రకాన్ని బట్టి రూ.320 మొదలుకుని గరిష్టంగా రూ.800 వరకు చెల్లించాల్సి ఉంటుంది. నకిలీ నంబర్ ప్లేట్ల వినియోగాన్ని కట్టడి చేయడం, వాహనాల చోరీలను నియంత్రించడంలో భాగంగా ఈ చర్యలు చేపట్టారు. సుప్రీం కోర్టు ఆదేశాల నేపథ్యంలో రవాణా శాఖ ఉత్తర్వులు జారీ చేసినట్టు పేర్కొన్నారు. 2019 ఏప్రిల్ 1 నుంచి తయారైన వాహనాలకు హైసెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్ నిబంధన ఇప్పటికే దేశ వ్యాప్తంగా అమల్లో ఉంది. పాత వాహనాలు కూడా ఇందుకు అనుగుణంగా నంబర్ ప్లేట్లను మార్చాల్సి ఉంటుంది.