DRDO: డీఆర్డీవో వండర్.. దటీజ్ ఇండియా.. ఇక చైనాకు చుక్కలే!

Written by RAJU

Published on:

DRDO: డీఆర్డీవో వండర్.. దటీజ్ ఇండియా.. ఇక చైనాకు చుక్కలే!

డీఆర్డీవో రూపొందించిన లేజర్ ఆధారిత ఆయుధ వ్యవస్థ విజయవంతంగా పరీక్షించారు. ఈ పరీక్షతో భారత్, అమెరికా, చైనా, రష్యా వంటి దేశాల సరసన నిలిచింది. అత్యాధునిక లేజర్ ఆధారిత డైరెక్టెడ్ ఎనర్జీ వెపన్ టెక్నాలజీ కలిగిన దేశాల జాబితాలో చేరింది. ఈ సాంకేతికత మిస్సైళ్లు, డ్రోన్లు, చిన్న ప్రయోగాక్షేపణాల వంటి లక్ష్యాలను క్షణాల్లో నిర్వీర్యం చేయగలదు.

ఈ సిస్టమ్‌ను డీఆర్డీవోలోని CHESS రూపొందించగా, ఇతర ల్యాబ్‌లు, విద్యాసంస్థలు, భారతీయ పరిశ్రమలు కలిసి పనిచేశాయి. 30 కిలోవాట్ల శక్తితో పనిచేసే Mk-II(A) లేజర్ వ్యవస్థకు కర్నూల్‌లోని నేషనల్ ఓపెన్ ఎయిర్ రేంజ్‌ వద్ద పరీక్షలు నిర్వహించబడ్డాయి. పరీక్షలో ఇది ఫిక్స్‌డ్ వింగ్ డ్రోన్లను పొడవైన దూరాల్లో గుర్తించి నాశనం చేసింది. శత్రు నిఘా సెన్సర్లు, యాంటెనాలను కూడా ధ్వంసం చేసింది. ఈ వ్యవస్థ కేవలం క్షణాల్లో లక్ష్యాన్ని ఛేదించే శక్తిని కలిగి ఉందని రక్షణ వర్గాలు చెబుతున్నాయి. ఈ లేజర్ వ్యవస్థలు తమ సొంత ఎలక్ట్రో-ఆప్టిక్ సిస్టమ్ లేదా రాడార్ ద్వారా లక్ష్యాలను గుర్తించి, లైట్ స్పీడ్‌తో దాడి చేస్తాయి. లక్ష్యంపై తక్కువ కాలానికి అత్యంత అధిక ఉష్ణతిని పంపిస్తూ దానిని పగలగొట్టగలుగుతుంది. కొన్నిసార్లు నేరుగా వార్‌హెడ్‌ను టార్గెట్ చేయడం ద్వారా భారీ విధ్వంసాన్ని సృష్టించగలదు.

ఇలాంటి ఆయుధాల అభివృద్ధితో ఖరీదైన మిస్సైల్‌లు, బుల్లెట్లు వాడకుండానే లక్ష్యాలను తక్కువ వ్యయంతో చేంజ్ చేయడం సాధ్యమవుతుంది. డ్రోన్‌ల వంటి తక్కువ ఖర్చుతో తయారయ్యే ముప్పులను తట్టుకోడానికి ఇది అత్యంత బలమైన పరిష్కారంగా నిలుస్తుంది. అలాగే, కొలేటరల్‌ డ్యామేజ్‌ లేకుండా లక్ష్యాన్ని ఛేదించేందుకు ఇది ఉత్తమ పరిష్కారం కావొచ్చని భావిస్తున్నారు.

Subscribe for notification
Verified by MonsterInsights