Crypto Regulations: ఆధునిక ఆర్థికవిధానంలో ఉన్న చిక్కుల్లో.. ఒకప్పుడు సముద్ర వాణిజ్యం ఉన్నట్లు ఇప్పుడు క్రిప్టో ఆస్తులు ఉన్నాయి. ఇందులో అవకాశం, ప్రమాదం రెండూ ఉంటాయి. ప్రతి విషయంలో అభివృద్ధి ఉన్నట్లే మన దేశంలోని క్రిప్టో రెగ్యులేటరీ విధానం ప్రస్తుతం అన్వేషణ దశలో ఉంది. 2025 వచ్చేసింది. ఈ విధానం దేశ నాయకులతో పాటు.. ఇందులో ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలనే ప్రతి మదుపుదారు, వ్యాపారి దృష్టిసారించాలని భావిస్తున్నారు.
క్రిప్టోపై భారత్ వైఖరి నిర్మాణాత్మక వివేకంతో కూడుకున్నది. అవసరమైనప్పుడు వ్యవహరించే ధోరణితో ‘వేచి చూసే’ విధానాన్ని ఈ దేశం అవలంబిస్తోంది. అయితే క్రిప్టో, వర్చువల్ డిజిటల్ ఆస్తులను (వీడీఏ) ప్రస్తుత ట్యాక్స్ అండ్ కాంప్లయన్స్ ఫ్యాబ్రిక్లో కొంత మేరకు కేంద్రం పొందుపరిచిందని, ఒక ప్రత్యేకమైన వాతావరణాన్ని రూపొందిస్తోంది. దీనిపై అవగాహన కలిగేందుకు దోహదపడుతుందని జియోటస్ క్రిప్టో ప్లాట్ఫామ్ సీఈవో విక్రమ్ సుబ్బురాజ్ అన్నారు.
నియంత్రణ విధానం:
వీడీఏల నుంచి వచ్చే లాభాలపై భారత్ 30 శాతం పన్ను విధిస్తోంది. దీనికి హోల్డింగ్ పీరియడ్ లేదా ట్రేడింగ్ స్కేల్ తో సంబంధం లేదు. నష్టాలను పూడ్చుకోవడానికి ఈ పన్ను విధానంలో వీలుండదు. ఇది మార్కెట్ లో పాల్గొనే ప్రతి ఒక్కరికీ రిస్క్ మేనేజ్ మెంట్ ను ఒక ముఖ్యమైన నైపుణ్యంగా చేస్తుంది. లావాదేవీలపై మూలం వద్ద 1% పన్ను మినహాయింపు (టీడీఎస్) వర్తిస్తుంది. దీన్ని సులభంగా గుర్తించాలి. ఇతరత్రా వ్యాపారాల తరహాలో దాచిపెట్టలేరు.
మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) కింద ఎన్ఫోర్స్మెంట్ను క్రిస్టలైజ్ చేయడం అనేది ఓ కొత్త విషయం. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖకు చెందిన ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ (ఎఫ్ఐయూ)లో రిజిస్టర్ అయిన ఎక్స్ఛేంజీలు నో యువర్ కస్టమర్ (కేవైసీ), యాంటీ మనీ లాండరింగ్ (ఏఎంఎల్) ప్రోటోకాల్స్ లాంటివాటిని సంప్రదాయ ఆర్థిక సంస్థల్లాగే కఠినంగా పాటించాలి. ఇది పెట్టుబడిదారులకు మరింత రక్షణ, సంస్థాగత చట్టబద్ధతకు వేదికను కల్పిస్తుంది. క్రిప్టో ఊహాజనిత కొత్తదనం స్థాయి నుంచి విశ్వసనీయ ఆస్తి వరకు అభివృద్ధి చెందడానికి ఇది అవసరం.
నిబంధనలను సాధారణంగా ఒంటరిగా రూపొందించరు. భారతదేశ విధాన దిశ అంతర్జాతీయ చర్చకు అద్దం పడుతోంది. స్థిరమైన, వికేంద్రీకృత ఫైనాన్స్ (డీఫై) కోసం మరింత నిర్వచించిన నిబంధనల దిశగా అమెరికా అడుగులు వేస్తోంది. ఈయూ మార్కెట్స్ ఇన్ క్రిప్టో ఎసెట్స్ (ఎంఐసీఏ) ఫ్రేం వర్క్ ఇప్పటికే సిద్ధమవుతోంది. ఆఫ్ షోర్ ఎక్స్ఛేంజీలు, వాలెట్లపై ఇటీవల భారతదేశం తీసుకున్న అణచివేత చర్యలు.. ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ (ఎఫ్ఏటీఎఫ్) ట్రావెల్ రూల్, గ్లోబల్ ఏఎంఎల్ ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయి.
2025లో భారత్ ‘మల్టీ ఏజెన్సీ ఓవర్ సైట్ ఫ్రేం వర్క్’ను అధికారికంగా ప్రకటించడం ఒక ముఖ్యమైన పరిణామం. సెక్యూరిటీలను పోలిన టోకెన్ల కోసం సెబీ; పేమెంట్ టోకెన్ల కోసం ఆర్బీఐ; లేదా బ్లాక్ చెయిన్ టెక్నాలజీ వాడకం కేసుల కోసం మెయిటీ ఉన్నాయి. పెట్టుబడిదారులకు ఇదంతా చూస్తే మొదట్లో చాలా గందరగోళంగా అనిపించవచ్చు. కానీ, ఇది అస్పష్టతను కచ్చితంగా తొలగించి, బాధ్యతాయుతమైన ఆవిష్కరణలను ప్రోత్సహిస్తుంది.
ట్రేడర్లు, మదుపుదారులు ఏం చేయాలి?
మదుపుదారులు తప్పనిసరిగా ఎఫ్ఐయూ-నమోదిత ప్లాట్ఫాంల మీదే ట్రేడింగ్ చేయాలి. వాటికి కట్టుబడి ఉండాలి. తెలివైన మదుపుదారులు పన్నులకు కూడా ప్లాన్ చేసుకోవాలి. రిటర్న్స్ లెక్కించుకునేటప్పుడు వారు 30% పన్ను, టీడీఎస్లను గమనించాలి. పన్ను విషయాలను బయటపెట్టేందుకు బల్క్ ఎగ్జిట్ కంటే ఎప్పటికప్పుడు లాభాల స్వీకరణ చూసుకోవడం మంచిది.
గమనించాల్సిన ఇతర ముఖ్యాంశాలు, సంకేతాలు:
నియంత్రణలు త్వరలోనే కాస్త సరళతరం కావచ్చు. ముఖ్యంగా నష్టాలను పూడ్చడం లేదా టీడీఎస్ క్రమబద్ధీకరణ లాంటివి రావచ్చు. కానీ అవి వచ్చేవరకు ప్రస్తుతమున్న నిబంధనల విషయంలో ఎలాంటి మార్పులు ఉండవు.
స్మార్ట్గా డైవర్సిఫై చేయండి:
టోకెన్లన్నీ సమానంగా రూపొందలేదు. అందువల్ల టోకెనామిక్స్, ఆన్-చైన్ మెట్రిక్స్, యుటిలిటీల గురించి పరిశోధించండి. ఎప్పటికప్పుడు మెరుగుపడుతున్న నియంత్రణ వ్యవస్థలో తాత్కాలిక లాభాల కంటే దీర్ఘకాలిక పెట్టుబడులు మెరుగ్గా ఉండచ్చు. బాగా ఎక్కువ లాభాలు వస్తాయన్న ఆశల కంటే పెట్టుబడుల వారీగా చూసుకోవడం మంచిది.
నిబంధనలకు కట్టుబడి ఉండండి:
ఇప్పుడు ఇంటర్నెట్ అనేది అనివార్యం. కానీ, అంతకుముందు దాన్ని తప్పుగా అర్థం చేసుకుని ఆందోళనకు గురయ్యారు. అలాగే ఇప్పుడు క్రిప్టో ఎసెట్లు కూడా ప్రారంభదశలో ఉన్నాయి. వాటిపై నిబంధనలు ఇప్పుడు కఠినంగా అనిపించవచ్చు. కానీ ఎక్కువమంది వీటిని స్వీకరించేందుకు వీలుగా ఆ నిబంధనలు రూపొందుతున్నాయి. వాగ్దానాలు, ప్రోటోకాల్.. ఈ రెండింటికీ కట్టుబడి ఉండాలనుకునేవారికి మంచిరోజులు ముందున్నాయి. ఇది కేవలం ప్రారంభం మాత్రమే. 2025లో తెలివిగా వ్యవహరించడం కీలకం. తగిన సమాచారం తెలుసుకోండి. నిబంధనలకు కట్టుబడి ఉంటూ లాభాలు పొందండి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి