
మలబద్ధకం అనేది చాలా మందికి ఇబ్బందిని కలిగించే సమస్య. ఇది కడుపులో నొప్పి, వాంతులు, అసౌకర్యం లాంటి లక్షణాలను కలిగిస్తుంది. కొంతమంది రోజూ ఈ సమస్యతో బాధపడుతుంటారు. అయితే కొన్ని పండ్లు సహజంగా ఈ సమస్యను తగ్గించడంలో సహాయపడతాయి. ఆ పండ్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
డ్రాగన్ ఫ్రూట్ లో తేమ పదార్థం, ఫైబర్ ఎక్కువగా ఉంటాయి. ఈ రెండు కలిసి శరీరంలో జీర్ణక్రియకు మంచి సహాయం చేస్తాయి. ఈ పండు మలబద్ధకం నుంచి ఉపశమనం ఇస్తుంది. శరీరంలో ఉన్న మలాన్ని బయటకు పంపించడంలో కూడా ఇది ఉపయోగపడుతుంది.
నారింజలో కరిగే ఫైబర్ బాగా ఉంటుంది. ఇది జీర్ణ వ్యవస్థ సజావుగా పనిచేయడానికి సహాయపడుతుంది. నారింజ తినడం వల్ల మలబద్ధకం తగ్గుతుంది. అంతేకాకుండా శరీరం కూడా తేలికగా అనిపిస్తుంది.
కివి పండులో నీరు ఎక్కువగా ఉంటుంది. దీనితోపాటు ఫైబర్ కూడా ఉండటం వల్ల ప్రేగులు సాఫీగా కదలడానికి సహాయపడుతుంది. దీనిని తినడం వల్ల మలబద్ధకం సమస్య తగ్గుతుంది. రోజూ కొంత మొత్తంలో కివి తినడం మంచిది.
ఆపిల్ లో పెక్టిన్ అనే ఫైబర్ ఉంటుంది. ఇది ప్రేగు కదలికలను మెరుగుపరచడంలో ఉపయోగపడుతుంది. ఆపిల్ తినడం వల్ల ప్రోబయోటిక్లు కూడా శరీరానికి లభిస్తాయి. ఇవి జీర్ణవ్యవస్థను బలపరిచి మలబద్ధకాన్ని తగ్గిస్తాయి.
జామ ఫలాల్లో ఫైబర్, ఫ్రక్టోజ్, సార్బిటాల్ అనే పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి శరీరానికి తేలికగా ఉండేలా చేస్తాయి. ప్రేగు కదలికలు సజావుగా జరిగేలా సహాయపడతాయి. జామ పండును క్రమం తప్పకుండా తింటే కడుపు సమస్యలు తగ్గుతాయి.
బొప్పాయి పండులో ఫైబర్, నీరు, జీర్ణక్రియకు అవసరమైన ఎంజైమ్లు ఉంటాయి. ఇవి కలసి ప్రేగులను బాగా కదిలించడానికి సహాయపడతాయి. బొప్పాయి మలబద్ధకం సమస్యను తగ్గించడంలో మంచి ఫలితం ఇస్తుంది. ఈ పండ్లను రోజూ తీసుకుంటే మలబద్ధకం సమస్య నెమ్మదిగా తగ్గుతుంది.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)