Chhattisgarh Encounter : ఛత్తీస్ గడ్ దంతేవాడ జిల్లాలో జరిగిన ఎన్ కౌంటర్ లో మావోయిస్తు ముఖ్యనాయకురాలు రేణుక అలియాస్ చైతు మృతి చెందారు. ఆమె స్వస్థలం ఉమ్మడి వరంగల్ జిల్లా కడవెండి గ్రామం. ఎల్ఎల్బీ చదివిన చైతు తిరుపతిలో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేశారు. 35 ఏళ్ల క్రితం ఆమె మావోయిస్టు పార్టీలో చేరారు.