CBSE Class 10th 12th Result 2025 : సీబీఎస్ఈ (Central Board of Secondary Education – CBSE) ఫలితాల విడుదల కోసం లక్ష్యల మంది విద్యార్థులు ఎదురుచూస్తున్నారు. వివరాల్లోకెళ్తే..
హైలైట్:
సీబీఎస్ఈ రిజల్ట్ 2025
త్వరలో ఫలితాలు విడుదల
ఏర్పాట్లలో నిమగ్నమైన బోర్డు
Samayam Teluguసీబీఎస్ఈ టెన్త్ రిజల్ట్ 2025
CBSE Class 10 Result 2025 Live: విద్యార్థులు గుడ్న్యూస్. 2024-25 సంవత్సరానికి సంబంధించిన సీబీఎస్ఈ 10వ తరగతి ఫలితాలు త్వరలో విడుదల చేయడానికి సీబీఎస్ఈ బోర్డు (CBSE Board) ఏర్పాట్లు చేస్తోంది. విద్యార్థులు తమ ఫలితాల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దేశవ్యాప్తంగా ఈ ఏడాది ఫిబ్రవరి 15 నుంచి మార్చి 18 వరకు పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే. అయితే.. ఈ పరీక్షా ఫలితాలు మే నెల ప్రారంభంలో వెలువడే అవకాశం ఉంది. విద్యార్థులు ఫలితాలు వెలువడిన తర్వాత 11వ తరగతికి సైన్స్, కామర్స్ లేదా ఆర్ట్స్లో చేరే ఆప్షన్ ఎంపిక చేసుకుంటారు. ఇది విద్యార్థుల భవిష్యత్తును ప్రభావితం చేసే నిర్ణయం. దీంతో విద్యార్థులు ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు. విద్యార్థులు తమ ఫలితాలను అధికారిక వెబ్సైట్ https://www.cbse.gov.in/ లేదా డిజిలాకర్ ద్వారా చెక్ చేసుకోవచ్చు. గత ఫలితాల విడుదల సరళిని బట్టి చూస్తే.. ఈసారి సీబీఎస్ఈ 10, 12వ తరగతి పరీక్ష ఫలితాలు మే నెలలో విడుదల కావచ్చని అంచనా. గత ఏడాది సీబీఎస్ఈ 10, 12 తరగతి పరీక్షల ఫలితాలు మే 13వ తేదీన విడుదల కాగా 2023లో మే 12వ తేదీన విడుదలయ్యాయి. 2022లో జూలై 22వ తేదీన, 2021లో ఆగస్టు 3వ తేదీన విడుదలయ్యాయి. ఈసారి మే నెల ప్రారంభంలో ఫలితాలు విడుదల కావచ్చని అంచనా.
సీబీఎస్ఈ (CBSE)పదో తరగతి పరీక్షలు ఫిబ్రవరి 15వ తేదీన ప్రారంభమై.. మార్చి 18వ వరకూ జరిగాయి. సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్షలు ఏప్రిల్ 4వ తేదీతో ముగిశాయి. 44 లక్షలకు పైగా విద్యార్థులు ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు.
ఇక ఐసీఎస్ఈ 10, 12 తరగతి పరీక్ష ఫలితాలు కూడా మే నెలలో విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. ఐసీఎస్ఈ పదో తరగతి పరీక్షలు ఫిబ్రవరి 18 నుంచి మార్చి 27 వరకు జరగగా.. 12వ తరగతి పరీక్షలు ఫిబ్రవరి 13వ తేదీ నుంచి ప్రారంభమై.. ఏప్రిల్ 5వ తేదీతో ముగిశాయి. గత ఏడాది ఈ ఫలితాలు మే 6వ తేదీన విడుదల కాగా అంతకంటే ముందు 2023లో మే 14వ తేదీన విడుదలయ్యాయి. ఈసారి మే రెండో వారంలో ఫలితాలు విడుదల కానున్నట్లు సమాచారం. విద్యార్థులు ఈ ఫలితాలను https://cisce.org/ వెబ్సైట్ ద్వారా చెక్ చేసుకోవచ్చు.
రచయిత గురించికిషోర్ రెడ్డికిషోర్ రెడ్డి డైనమిక్ రైటర్, డిజిటల్ మీడియా ప్రొఫెషనల్. ఈ రంగంలో 6.8 సంవత్సరాల అనుభవం ఉంది. అతను డిజిటల్ మీడియాలో తన ప్రస్థానం ప్రారంభించినప్పటి నుంచి రాజకీయ, సినిమా, విద్య, ఉద్యోగాలు సహా అనేక విభాగాలను నిర్వహించడంలో గణనీయమైన నైపుణ్యాన్ని పొందారు.
రాయడంలో అతనికున్న అభిరుచి, కరెంట్ అఫైర్స్పై లోతైన జ్ఞానంతో కిషోర్ ఈ పరిశ్రమలో తనకంటూ ఒక పేరు తెచ్చుకున్నారు. విభిన్న విభాగాలలోని పాఠకులకు ఆకర్షణీయమైన సందేశాత్మక కంటెంట్ను రూపొందించారు. ప్రస్తుతం అతను పనిచేస్తున్న విభాగంలో.. 4.5 ఏళ్లుగా నిర్దిష్ట విభాగాన్ని నిర్వహిస్తున్నారు. అతను వ్యూవర్స్కు నచ్చే అత్యంత నాణ్యమైన కంటెంట్ను స్థిరంగా అందిస్తున్నారు.
కిషోర్ ఖాళీగా ఉన్నప్పుడు పుస్తకాలు చదవడం, ప్రముఖుల ఇంటర్వ్యూలు చూడటం వంటివి చేస్తుంటారు. ఈ పనులు తనను రిలాక్స్ చేస్తాయని, క్రియేటివిటీని రీఛార్జ్ చేస్తాయని అతను నమ్ముతున్నాడు.… ఇంకా చదవండి