ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. జనాభా లెక్కలతో పాటే కులగణను చేయాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. కులగణనకు రాజకీయ వ్యవహారాల కేబినెట్ కమిటీ CCPA ఆమోదం తెలిపింది. కేంద్ర కేబినెట్ జనాభా లెక్కలతో పాటే కులగణను చేయాలని నిర్ణయం తీసుకోవడంపై కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. సమానత్వం, సామరస్యం, సుపరిపాలన, సామాజిక న్యాయం.. నూతన శకానికి నాంది అంటూ ధర్మేంద్ర ప్రధాన్ ట్వీట్ చేశారు.
ధర్మేంద్ర ప్రధాన్ ఏమని ఎక్స్లో షేర్ చేశారంటే..
నేటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని, నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర మంత్రివర్గం రాబోయే జనాభా లెక్కల్లో కుల గణనను చేపట్టడానికి ఆమోదం తెలిపింది. ఈ చారిత్రాత్మక నిర్ణయాన్ని నేను స్వాగతిస్తున్నాను. విధాన రూపకల్పనలో అణగారిన, వెనుకబడిన వర్గాలను కేంద్రంగా ఉంచడం, సమాజంలోని అన్ని వర్గాలను అనుసంధానించడం, సామాజిక, విద్యా, ఆర్థిక అసమానతలను పారదర్శకంగా, ప్రామాణికమైన రీతిలో తొలగించడం, అన్ని వర్గాలకు సరైన హక్కులను నిర్ధారించడం వైపు ఇది సానుకూల అడుగు.. అంటూ ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు..
समता, समरसता, सुशासन और सामाजिक न्याय के एक नए युग का आरंभ!
प्रधानमंत्री @narendramodi जी के नेतृत्व में केंद्रीय कैबिनेट ने आज की आवश्यकताओं को ध्यान में रखते हुए जातिगत जनगणना को आगामी जनगणना में शामिल करने की स्वीकृति प्रदान की है। इस ऐतिहासिक निर्णय का स्वागत करता हूँ।…
— Dharmendra Pradhan (@dpradhanbjp) April 30, 2025
ప్రధానమంత్రి మోదీ నాయకత్వంలో, గత 11 సంవత్సరాలుగా, రాజ్యాంగం ప్రాథమిక స్ఫూర్తికి అనుగుణంగా, అందరినీ కలుపుకొని, అందరినీ కలుపుకునే ప్రభుత్వం.. సబ్కా సాథ్, సబ్కా వికాస్ అనే సంకల్పంతో నడుస్తోంది.. సబ్కా సాథ్, సబ్కా వికాస్.. సామాజిక న్యాయం అనే భావనను బలోపేతం చేయడంలో నేటి నిర్ణయం ముఖ్యమైనదిగా నిరూపించబడుతుంది.. అని ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు.
కాంగ్రెస్ సహా ప్రతిపక్ష పార్టీలు కుల గణన అంశాన్ని ఎప్పుడూ తెరపైకి తెస్తున్నాయి.. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు, ఈ అంశం కుల సర్వేకే పరిమితం చేయబడింది. దీనిని ఎప్పుడూ జనాభా గణనలో భాగం చేయలేదు. కానీ మోడీ ప్రభుత్వ విధానం స్పష్టమైన, దూరదృష్టితో కూడిన నిర్ణయాలు తీసుకోవడం. చారిత్రక తప్పిదాలను సరిదిద్దాలనే ఈ సున్నితమైన నిర్ణయం ప్రధానమంత్రి దృఢ సంకల్పం వల్లే సాధ్యమైంది.. అంటూ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పేర్కొన్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..