BTech Jobs : బీఈ, బీటెక్‌ వాళ్లకు మాత్రమే.. బెల్‌లో ఇంజనీర్ ఉద్యోగాలు.. రూ.50వేల వరకు జీతం

Written by RAJU

Published on:

BEL Trainee and Project Engineer Recruitment 2025 : భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌ (బెల్‌) ప్రాజెక్ట్‌ ఇంజినీర్‌, ట్రైనీ ఇంజినీర్‌ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది.

హైలైట్:

  • బెల్‌ జాబ్‌ రిక్రూట్‌మెంట్‌ 2025
  • 45 పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల
  • మార్చి 12 దరఖాస్తులకు చివరితేది
Samayam Teluguబెల్‌ ఇంజనీర్ ఉద్యోగాలు
బెల్‌ ఇంజనీర్ ఉద్యోగాలు

BEL Recruitment 2025 : ప్రభుత్వ రక్షణ రంగ సంస్థ, నవరత్న హోదా కలిగిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పంచకుల జాబ్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా తాత్కాలిక ప్రాతిపదికన ఖాళీగా ఉన్న ఇంజినీర్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. ఈ ప్రకటన ద్వారా మొత్తం 45 ఖాళీలను భర్తీ చేయనున్నారు. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు మార్చి 12వ తేదీ వరకు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. రాతపరీక్ష, మెరిట్‌ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. అభ్యర్థులు పూర్తి వివరాలను నోటిఫికేషన్‌ ద్వారా తెలుసుకోవచ్చు. అలాగే దరఖాస్తు చేసుకోడానికి డైరెక్ట్‌ లింక్‌ ఇదే. మరికొన్ని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లు చెక్‌ చేసుకోడానికి డైరెక్ట్‌ లింక్‌ ఇదే.

మొత్తం ఖాళీల సంఖ్య: 45

  • ట్రైనీ ఇంజినీర్‌-1: 42
  • ప్రాజెక్టు ఇంజినీర్‌-1: 03

ఇతర ముఖ్యమైన సమాచారం :

  • అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్‌ (మెకానికల్, సివిల్, ఎలక్ట్రానిక్స్‌ Engineering)లో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
  • వయోపరిమితి: 1.02.2025 నాటికి ట్రైనీ ఇంజినీర్‌కు 28 ఏళ్లు, ప్రాజెక్టు ఇంజినీర్‌కు 32 ఏళ్లు ఉండాలి. ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల సడలింపు ఉంటుంది.
  • జీతం: నెలకు ట్రైనీ ఇంజినీర్‌ పోస్టులకు రూ.30,000 – 35,000, ప్రాజెక్టు ఇంజినీర్‌ పోస్టులకు రూ.40,000 – 50,000.
  • ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
  • దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ విధానంలో అప్లయ్‌ చేసుకోవాల్సి ఉంటుంది.
  • దరఖాస్తులకు చివరి తేదీ: మార్చి 12, 2025

మరో 20 సీనియర్ డిప్యూటీ ఇంజినీర్‌ ఉద్యోగాలు

భారత ప్రభుత్వరంగ సంస్థ నవరత్న కంపెనీ మచిలిపట్నంలోని భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌ (BEL).. ఫిక్స్‌డ్‌ టర్మ్‌ ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది. ఈ ప్రకటన ద్వారా మొత్తం 20 సీనియర్‌ డిప్యూటీ ఇంజినీర్‌ పోస్టులను భర్తీ చేయనుంది. అభ్యర్థులు పూర్తి వివరాలను అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా తెలుసుకోవచ్చు.

మొత్తం పోస్టులు సంఖ్య: 20

  • డిప్యూటీ ఇంజినీర్‌ (ఎలక్ట్రానిక్స్‌): 08
  • డిప్యూటీ ఇంజినీర్‌ (మెకానికల్‌): 12

ఇతర ముఖ్యమైన సమాచారం :

  • అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో బీఈ/ బీటెక్/ బీఎస్సీ ఇంజినీరింగ్‌/ ఏఎంఐఈ/ జీఐఈటీఈ ఉత్తీర్ణత ఉండాలి.
  • వయోపరిమితి: 01.02.2025 నాటికి జనరల్‌ అభ్యర్థులకు 28 ఏళ్లు.. ఒబీసీలకు 31 ఏళ్లు.. ఎస్సీ/ ఎస్టీ వారికి 33 ఏళ్లు ఉండాలి.
  • జీతం: నెలకు రూ.40,000 నుంచి రూ.1,40,000 వరకు ఉంటుంది.
  • ఎంపిక ప్రక్రియ: రాతపరీక్ష, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
  • దరఖాస్తు ఫీజు: జనరల్‌/ ఓబీసీ/ ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు రూ.472 ఫీజు ఉంటుంది. (ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూబీడీ/ ఎక్స్‌ సర్వీస్‌మెన్‌ వారికి ఫిజులో మినహాయింపు ఉంటుంది).
  • దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ విధానంలో అప్లయ్‌ చేసుకోవాల్సి ఉంటుంది.
  • దరఖాస్తులకు చివరి తేదీ: మార్చి 31, 2025
కిషోర్‌ రెడ్డి

రచయిత గురించికిషోర్‌ రెడ్డికిషోర్‌ రెడ్డి డైనమిక్ రైటర్, డిజిటల్ మీడియా ప్రొఫెషనల్. ఈ రంగంలో 6.8 సంవత్సరాల అనుభవం ఉంది. అతను డిజిటల్ మీడియాలో తన ప్రస్థానం ప్రారంభించినప్పటి నుంచి రాజకీయ, సినిమా, విద్య, ఉద్యోగాలు సహా అనేక విభాగాలను నిర్వహించడంలో గణనీయమైన నైపుణ్యాన్ని పొందారు.
రాయడంలో అతనికున్న అభిరుచి, కరెంట్ అఫైర్స్‌పై లోతైన జ్ఞానంతో కిషోర్‌ ఈ పరిశ్రమలో తనకంటూ ఒక పేరు తెచ్చుకున్నారు. విభిన్న విభాగాలలోని పాఠకులకు ఆకర్షణీయమైన సందేశాత్మక కంటెంట్‌ను రూపొందించారు. ప్రస్తుతం అతను పనిచేస్తున్న విభాగంలో.. 4.5 ఏళ్లుగా నిర్దిష్ట విభాగాన్ని నిర్వహిస్తున్నారు. అతను వ్యూవర్స్‌కు నచ్చే అత్యంత నాణ్యమైన కంటెంట్‌ను స్థిరంగా అందిస్తున్నారు.
కిషోర్‌ ఖాళీగా ఉన్నప్పుడు పుస్తకాలు చదవడం, ప్రముఖుల ఇంటర్వ్యూలు చూడటం వంటివి చేస్తుంటారు. ఈ పనులు తనను రిలాక్స్ చేస్తాయని, క్రియేటివిటీని రీఛార్జ్‌ చేస్తాయని అతను నమ్ముతున్నాడు.
… ఇంకా చదవండి

Subscribe for notification