Breaking Information: ఏటీఎం చోరీ నిందితులు అరెస్టు..

Written by RAJU

Published on:

  • 2025-03-26T08:50:48+05:30

    లారీ ఢీకొని భార్యభర్త మృతి..

    • అల్లూరి జిల్లా: పాడేరు- అరకు జాతీయ రహదారిపై ఘోర రోడ్డుప్రమాదం

    • హుకుంపేట మండలం కోట్నాపల్లి వద్ద ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టిన లారీ

    • లారీ ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతిచెందిన దంపతులు

  • 2025-03-26T08:36:12+05:30

    ఘోర రోడ్డుప్రమాదం..

    • హైదరాబాద్: మహంకాళి పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోర రోడ్డుప్రమాదం

    • ప్రమాదవశాత్తూ కారు, ద్విచక్రవాహనం ఢీకొని ఇద్దరు వ్యక్తులు మృతి

    • ఘటనా స్థలంలోనే ఒకరు మృతిచెందగా ఆస్పత్రికి తరలిస్తుండగా మరొకరి మృతి

  • 2025-03-26T08:28:01+05:30

    ఏటీఎం చోరీ నిందితులు అరెస్టు..

    • రంగారెడ్డి: మహేశ్వరం పరిధి రావిర్యాల ఎస్‌బీఐ ఏటీఎం చోరీ కేసును ఛేదించిన పోలీసులు

    • ఇద్దరు నిందితులు హర్యానా రాష్ట్రం మేవాత్‌కు చెందిన వారిగా గుర్తించి అరెస్టు

    • ఈనెల 3న రావిర్యాలలోని ఎస్‌బీఐ ఏటీఎంలో రూ.13 లక్షలు ఎత్తుకెళ్లిన నిందితులు

    • నిందితులు ముంబై వైపునకు వెళ్తూ మైలార్ దేవ్ పల్లి మధుబన్ కాలనీలో ఏటీఎం చోరీకి యత్నం

    • షార్ట్ సర్క్యూట్ కారణంగా చెలరేగిన మంటలు, అక్కడ్నుంచి పారిపోయిన దొంగలు

    • నిందితుల కోసం మేవత్‌కు వెళ్లిన ప్రత్యేక బృందాలు, స్థానికుల సహాయంతో అరెస్టు

    • నిందితుల నుంచి గ్యాస్ కట్టర్లు, చోరీకి వినియోగించిన యంత్రం, ఇతర సామగ్రి స్వాధీనం

  • Subscribe for notification