Breakfast: చాలా మంది ఉదయం ఆఫీసుకు లేదా కాలేజీకి వెళ్లాలనే తొందరలో అల్పాహారం మానేస్తారు. ఈ అలవాటు ఆరోగ్యానికి ఏ మాత్రం మంచిది కాదు. అల్పాహారం తినడం వల్ల మనకు రోజంతా పని చేయడానికి శక్తి వస్తుంది. కాబట్టి, ఉదయం బ్రేక్ఫాస్ట్ చేయడం చాలా ముఖ్యం. అందువల్ల, మనం రోజులో తీసుకునే మొదటి భోజనం ఆరోగ్యంగా, శక్తిని పెంచేలా ఉండాలి. ఇందులో కొంత జాగ్రత్త కూడా అవసరం.. లేకపోతే ఆరోగ్యం దెబ్బతింటుంది. అయితే, అల్పాహారంగా వీటిని తీసుకుంటే ఆరోగ్యానికి మంచిదని నిపుణులు చెబుతున్నారు. అవెంటో ఇప్పుడు తెలుసుకుందాం..
అల్పాహారంగా వీటిని తీసుకోండి..
ఉదయం నిద్ర లేవగానే ముందుగా చేయాల్సిన పని ఒక గ్లాసు నీళ్లు తాగడం. తర్వాత మీ అల్పాహారంలో గింజలు, విత్తనాలను చేర్చండి. ఇది రోజంతా శరీరంలో శక్తిని నిర్వహిస్తుంది.. అంతేకాకుండా అలసట లేకుండా చేస్తుంది. ఈ గింజలు, విత్తనాలను తినడానికి వాటిని రాత్రంతా నీటిలో నానబెట్టండి. ఉదయం మీరు దాని నీరు త్రాగవచ్చు లేదా తినవచ్చు. మీరు ఒక నెల పాటు ఈ రొటీన్ను అనుసరిస్తే శరీరంలో సానుకూల మార్పులు కనిపిస్తాయి.
ఈ గింజలను ఖాళీ కడుపుతో తినండి
-
ఎండుద్రాక్ష
-
బాదం
-
మునక్క
-
పొద్దుతిరుగుడు విత్తనాలు
-
అవిసె గింజలు
-
ఖర్జూరం
-
గుమ్మడి
-
వాల్నట్లు
-
జీడిపప్పు
-
మఖానా
ఇవి మరింత రుచిగా ఉండాలంటే వాటిని చక్కెర లేదా తేనెతో తినండి. డైటీషియన్ సలహా మేరకు వాటిని పాలతో కూడా తినవచ్చు. వీటిని తీసుకుంటే శరీరంలో బలహీనత అనేది ఉండదు.
(NOTE: ఇంటర్నెట్లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ABN ఆంధ్రజ్యోతి బాధ్యత వహించదు.)