ABN
, Publish Date – Mar 24 , 2025 | 02:45 PM
Betting App Police Action: బెట్టింగ్ యాప్ కేసులో 19 మంది యాప్ ఓనర్లపై కేసులు నమోదు చేశారు పోలీసులు. సెలబ్రిటీలను సాక్షులుగా చేర్చే యోచనలో పోలీసులు ఉన్నట్లు తెలుస్తోంది.

Betting App Police Action
హైదరాబాద్, మార్చి 24: రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తోన్న బెట్టింగ్ యాప్స్ కేసులో (Betting App Case) కీలక మలుపు చోటు చేసుకుంది. 19 మంది బెట్టింగ్ యాప్ ఓనర్లపై మియాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. యాప్ల యజమానులే లక్ష్యంగా పోలీసుల చర్యలు చేపట్టారు. ఈ కేసులో సెలబ్రిటీలను సాక్షులుగా చేర్చే యోచనలో పోలీసులు ఉన్నట్లు తెలుస్తోంది. యాప్ నిర్వాహకులే టార్గెట్గా కొత్త సెక్షన్లు ప్రయోగిస్తున్నారు. మొత్తం 19 మందిని నిందితులుగా చేర్చి విచారణ చేపట్టనున్నారు. ఈ వ్యవహారంలో కోర్టులో మియాపూర్ పోలీసులు మెమో దాఖలు చేశారు. యాప్ ప్రమోషన్స్ చేసిన వాళ్ళ స్టేట్మెంట్ రికార్డ్ చేయనున్నారు. బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ చేసిన వారిని ఛార్జ్ షీట్లో సాక్షులుగా చేర్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఇవి కూడా చదవండి…
Nagpur Riots Latest Update: నాగ్పూర్ అల్లర్లలో నిందితుడిపై మహా సర్కార్ రియాక్షన్ ఇదీ..
Loan Repayment Tips: ఇలా చేయకపోతే… అప్పుల్లో తలనొప్పులు ఖాయం
Read Latest Telangana News And Telugu News
Updated Date – Mar 24 , 2025 | 02:46 PM