APPSC Group 2 Hall Ticket 2025 : ఏపీపీఎస్సీ గ్రూప్‌ 2 మెయిన్స్‌ హాల్‌టికెట్లు.. డౌన్‌లోడ్‌ లింక్‌ ఇదే

Written by RAJU

Published on:

APPSC Group 2 Admit Card 2025 : ఆంధ్రప్రదేశ్‌ గ్రూప్‌ 2 మెయిన్స్‌ పరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్లు అదికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులోకి తీసుకురానుంది. అయితే..

Samayam Teluguఏపీ గ్రూప్‌ 2 మెయిన్స్‌ హాల్‌టికెట్‌ 2025
ఏపీ గ్రూప్‌ 2 మెయిన్స్‌ హాల్‌టికెట్‌ 2025

APPSC Group 2 Mains Hall Ticket 2025 : ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్ కమిషన్‌ (APPSC) గ్రూప్‌ 2 మెయిన్స్‌ హాల్‌ టికెట్లు విడుదల చేసింది. ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఫిబ్రవరి 13వ తేదీ నుంచి అధికారిక వెబ్‌సైట్‌ (https://psc.ap.gov.in/ – Download Hall Ticket ) వెబ్‌సైట్ ద్వారా హాల్ టికెట్స్‌ డౌన్‌లోడ్ చేసుకోవచ్చని తెలిపింది. ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదల చేసింది. అలాగే.. ఫిబ్రవరి 23వ తేదీన నిర్వహించే ఏపీపీఎస్సీ గ్రూప్‌-2 మెయిన్స్ పరీక్షకు 13 జిల్లాల్లో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఏపీపీఎస్సీ వెల్లడించింది.

వాస్తవానికి 2024 జులై 28న జరగాల్సిన ఏపీపీఎస్సీ గ్రూప్‌ 2 మెయిన్స్‌ పరీక్షను నిర్వహించాల్సి ఉంది. అప్పట్లో అభ్యర్థుల అభ్యర్థనల మేరకు ఈ పరీక్షలను వాయిదా వేశారు. అనంతరం 2025 ఫిబ్రవరి 23న నిర్వహించనున్నట్లు ప్రకటించారు. అయితే.. 2024 ఫిబ్రవరి 25న ఏపీపీఎస్సీ గ్రూప్-2 ప్రిలిమ్స్ నిర్వహించగా.. ఏప్రిల్ 10వ తేదీన ఫలితాలు విడుదల చేసిన విషయం తెలిసిందే. ఆ ఫలితాల్లో మొత్తం 92,250 మంది అభ్యర్థులు గ్రూప్-2 మెయిన్స్ పరీక్షకు ఎంపికైనట్లు ఏపీపీఎస్సీ కమిషన్‌ ప్రకటించింది. వివిధ కారణాలతో 2557 మంది అభ్యర్థులను రిజెక్ట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ 899 గ్రూప్-2 పోస్టులను భర్తీ చేయనుంది.

మే 3 నుంచి గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షలు

మరోవైపు ఆంధ్రప్రదేశ్‌ గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షల తేదీలను ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (APPSC) ఇటీవల ప్రకటించింది. ఈ పరీక్షలను మే 3 నుంచి 9 వరకు నిర్వహించాలని నిర్ణయించింది. అలాగే.. డిప్యూటీ ఎడ్యుకేషనల్‌ ఆఫీసర్‌ (పాఠశాల విద్యాశాఖ), ఎన్విరాన్‌మెంటల్‌ ఇంజినీర్, అనలిస్టు గ్రేడ్‌-2 (పర్యావరణ శాఖ), అసిస్టెంట్‌ లైబ్రేరియన్‌ (ఎన్టీఆర్‌ వర్సిటీ), జూనియర్‌ అసిస్టెంట్‌ (ఎన్టీఆర్‌ వర్సిటీ), ఫారెస్ట్‌ రేంజి ఆఫీసర్, అసిస్టెంట్‌ డైరెక్టర్‌ (ఏపీ టౌన్‌ అండ్‌ కంట్రీప్లానింగ్‌), లైబ్రేరియన్‌ (ఆరోగ్యశాఖ), అసిస్టెంట్‌ ట్రైబల్‌ ఆఫీసర్, దివ్యాంగుల సంక్షేమ శాఖలో అసిస్టెంట్‌ డైరెక్టర్, ఏపీ భూగర్భ నీటిపారుదల శాఖలో అసిస్టెంట్‌ కెమిస్ట్, ఆంధ్రప్రదేశ్‌ ఎలక్ట్రికల్‌ ఇన్‌స్పెక్టరేట్‌ సర్వీసెస్‌లో అసిస్టెంట్‌ ఎలక్ట్రికల్‌ ఇన్‌స్పెక్టర్, అసిస్టెంట్‌ స్టాటిస్టికల్‌ ఆఫీసర్‌ (ఆర్థిక, గణాంకాల శాఖ), ఫిషరీస్‌ డెవలప్‌మెంట్‌ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి ఇప్పటికే నోటిఫికేషన్లు వెలువడ్డాయి. వీటికి సంబంధించిన పరీక్ష తేదీలు ఇటీవల ఏపీపీఎస్సీ కమిషన్‌ వెల్లడించింది.

కిషోర్‌ రెడ్డి

రచయిత గురించికిషోర్‌ రెడ్డికిషోర్‌ రెడ్డి డైనమిక్ రైటర్, డిజిటల్ మీడియా ప్రొఫెషనల్. ఈ రంగంలో 6.8 సంవత్సరాల అనుభవం ఉంది. అతను డిజిటల్ మీడియాలో తన ప్రస్థానం ప్రారంభించినప్పటి నుంచి రాజకీయ, సినిమా, విద్య, ఉద్యోగాలు సహా అనేక విభాగాలను నిర్వహించడంలో గణనీయమైన నైపుణ్యాన్ని పొందారు.
రాయడంలో అతనికున్న అభిరుచి, కరెంట్ అఫైర్స్‌పై లోతైన జ్ఞానంతో కిషోర్‌ ఈ పరిశ్రమలో తనకంటూ ఒక పేరు తెచ్చుకున్నారు. విభిన్న విభాగాలలోని పాఠకులకు ఆకర్షణీయమైన సందేశాత్మక కంటెంట్‌ను రూపొందించారు. ప్రస్తుతం అతను పనిచేస్తున్న విభాగంలో.. 4.5 ఏళ్లుగా నిర్దిష్ట విభాగాన్ని నిర్వహిస్తున్నారు. అతను వ్యూవర్స్‌కు నచ్చే అత్యంత నాణ్యమైన కంటెంట్‌ను స్థిరంగా అందిస్తున్నారు.
కిషోర్‌ ఖాళీగా ఉన్నప్పుడు పుస్తకాలు చదవడం, ప్రముఖుల ఇంటర్వ్యూలు చూడటం వంటివి చేస్తుంటారు. ఈ పనులు తనను రిలాక్స్ చేస్తాయని, క్రియేటివిటీని రీఛార్జ్‌ చేస్తాయని అతను నమ్ముతున్నాడు.
… ఇంకా చదవండి

Subscribe for notification