అమరావతి: కేంద్ర కేబినెట్లో ఇవాళ(బుధవారం) పలు కీలక అంశాలపై చర్చించారు. ఇందులో ప్రధానంగా ఏపీలోని రైల్వేలైన్ ప్రాజెక్టుపై మంత్రి మండలి సమావేశంలో మాట్లాడారు. ఈ మేరకు రైల్వేలైన్ ప్రాజెక్టుకు సంబంధించిన నిధులను కేటాయించాలని నిర్ణయం తీసుకున్నారు. ఏపీలో రైల్వేలైన్ ప్రాజెక్టుకు రూ.1332 కోట్లు ఇస్తూ కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఉమ్మడి చిత్తూరులో తిరుపతి నుంచి తమిళనాడులోని వెల్లూరు జిల్లా కాట్పాడి వరకు రైల్వే లైన్ డబ్లింగ్కు నిధులు మంజూరు చేసింది. 113 కిలోమీటర్ల మేర ట్రాక్ను డబ్లింగ్ చేయడానికి నిధులు మంజూరుకు కేంద్ర కేబినెట్ ఆమోదించింది. తిరుపతి, పాకాల, కాట్పాడి రూట్లో మొత్తం 15 స్టేషన్ల పరిధిలో డబ్లింగ్ పనులు జరుగనున్నాయి. రెండో లైన్ అందుబాటులోకి రావడంతో ప్రయాణికుల రవాణాతో పాటు సరుకు రవాణాకు మార్గం సుగుమం కానుంది.
ఈ వార్తలు కూడా చదవండి
Trump China Tariffs: చైనాపై ట్రంప్ బాదుడు 104 శాతానికి!
Saif Ali Khan Stabbing Case: సైఫ్ అలీఖాన్పై దాడి కేసులో కీలక పరిణామం..
Big Shock To Kakani: కాకాణి బెయిల్.. నో చెప్పిన హైకోర్టు
Read Latest AP News And Telugu News