Ap Inter Outcomes 2025,AP Inter Outcomes : నో టెన్షన్‌.. ఈసారి వాట్సాప్‌ ద్వారానే ఏపీ ఇంటర్‌ ఫలితాలు 2025.. మార్క్స్‌ మెమో కూడా! – ap inter outcomes 2025 bieap 1st 2nd 12 months intermediate outcome anticipated quickly

Written by RAJU

Published on:

Manabadi Inter Results 2025 : ఆంధ్రప్రదేశ్‌ ఇంటర్మీడియట్‌ పరీక్షా ఫలితాలు విడుదలకు బోర్డు ఏర్పాట్లు చేస్తోంది. వీలైనంత తొందరగా రిజల్ట్స్‌ విడుదల చేసేందుకు మూల్యాంకనం వేగంగా నిర్వహిస్తోంది.

Samayam Teluguఏపీ ఇంటర్ రిజల్ట్స్‌ 2025
ఏపీ ఇంటర్ రిజల్ట్స్‌ 2025

AP Inter Results 2025 : ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్ ఫలితాలు వెల్లడించే సమయం సమీపిస్తోంది. మార్చి 1వ తేదీ నుంచి 20వ తేదీ వరకూ ఇంటర్మీడియట్‌ వార్షిక పరీక్షలు జరగగా ప్రస్తుతం వాల్యుయేషన్ ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. వీలైనంత తొందరగా అంటే ఏప్రిల్‌ నెలలోనే ఇంటర్ ఫలితాలు విడుదల చేసేందుకు ఏపీ ఇంటర్మీడియట్ బోర్డ్ సన్నాహాలు చేస్తోంది. బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ ఈసారి వాట్సప్ ద్వారా కూడా ఫలితాలు వెల్లడించనుంది. కాబట్టి విద్యార్థులు వాట్సాప్‌ (9552300009) ద్వారా లేదా అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా తమ ఫలితాలు చెక్‌ చేసుకోవచ్చు.

ఏపీలో ఇంటర్ పరీక్షలు పూర్తయి అప్పుడే 15 రోజులవుతోంది. ప్రస్తుతం పేపర్ వాల్యుయేషన్ జరుగుతోంది. ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు మార్చి 1 నుంచి 19 వరకు జరిగితే.. రెండో సంవత్సరం పరీక్షలు మార్చి 3 నుంచి 20 వరకూ జరిగాయి. ఏప్రిల్‌ 10 -12 తేదీల వరకు మూల్యాంకనం జరగవొచ్చు. ఆ తరువాత మార్కుల కంప్యూటరీకరణ ఉంటుంది. ఏప్రిల్ 15-20 మధ్యలో ఫలితాలు విడుదల చేసేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమౌతోంది. ఎప్పటిలానే https://bieap.apcfss.in/ లేదా https://bie.ap.gov.in/ ద్వారా ఫలితాలు చూసుకోవచ్చు.

అలాగే.. ఏపీ ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన వాట్సప్ సేవలతో కూడా ఇంటర్ ఫలితాలు తెలుసుకోవచ్చు. మార్కుల మెమో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ముందుగా మీ మొబైల్ ఫోన్‌లో ఏపీ ప్రభుత్వం వాట్సప్ నెంబర్ 9552300009 సేవ్ చేసుకోవాలి. ఇప్పుడు వాట్సప్ ఓపెన్ చేసి ఆ నెంబర్‌కు Hi అని టైప్ చేసి పంపించాలి. ఆ తరువాత సెలెక్ట్ సర్వీస్ కన్పిస్తుంది. అందులో ఎడ్యుకేషన్ సర్వీసెస్ క్లిక్ చేయాలి. అక్కడి నుంచి డౌన్‌లోడ్ ఎగ్జామ్ రిజల్ట్స్ క్లిక్ చేయాలి. ఆ తరువాత మీ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే చాలు మీ మార్కుల మెమో పీడీఎఫ్ కాపీ వాట్సాప్‌కు వస్తుంది.

ఏప్రిల్‌ 7 నుంచి ఇంటర్‌ ఫస్టియర్‌ అడ్మిషన్లు?
గతంలో పబ్లిక్‌ పరీక్షలు పూర్తయిన వెంటనే సెలవులు ఇస్తుండగా ఇకపై వాటిని కుదించింది. ఏప్రిల్ 23 నుంచి జూన్ 1 వరకు సెలవులు ఇవ్వనుంది. ఈ 23 రోజుల్లో దాదాపుగా 15 శాతం సిలబస్‌ పూర్తిచేసి వేసవి సెలవులు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇంటర్ విద్యలో సాధ్యాసాధ్యాలు, అమలు చేయాల్సిన మార్పులపై రాష్ట్ర ప్రభుత్వం నియమించిన కమిటీలు12 రాష్ట్రాల్లో పర్యటించి ఇచ్చిన నివేదిక ఆధారంగా పలు మార్పులకు శ్రీకారం చుట్టినట్లు సమాచారం. అలాగే.. ఈసారి ఏప్రిల్‌ 7 నుంచి ఫస్టియర్‌ అడ్మిషన్లు ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది.

కిషోర్‌ రెడ్డి

రచయిత గురించికిషోర్‌ రెడ్డికిషోర్‌ రెడ్డి డైనమిక్ రైటర్, డిజిటల్ మీడియా ప్రొఫెషనల్. ఈ రంగంలో 6.8 సంవత్సరాల అనుభవం ఉంది. అతను డిజిటల్ మీడియాలో తన ప్రస్థానం ప్రారంభించినప్పటి నుంచి రాజకీయ, సినిమా, విద్య, ఉద్యోగాలు సహా అనేక విభాగాలను నిర్వహించడంలో గణనీయమైన నైపుణ్యాన్ని పొందారు.
రాయడంలో అతనికున్న అభిరుచి, కరెంట్ అఫైర్స్‌పై లోతైన జ్ఞానంతో కిషోర్‌ ఈ పరిశ్రమలో తనకంటూ ఒక పేరు తెచ్చుకున్నారు. విభిన్న విభాగాలలోని పాఠకులకు ఆకర్షణీయమైన సందేశాత్మక కంటెంట్‌ను రూపొందించారు. ప్రస్తుతం అతను పనిచేస్తున్న విభాగంలో.. 4.5 ఏళ్లుగా నిర్దిష్ట విభాగాన్ని నిర్వహిస్తున్నారు. అతను వ్యూవర్స్‌కు నచ్చే అత్యంత నాణ్యమైన కంటెంట్‌ను స్థిరంగా అందిస్తున్నారు.
కిషోర్‌ ఖాళీగా ఉన్నప్పుడు పుస్తకాలు చదవడం, ప్రముఖుల ఇంటర్వ్యూలు చూడటం వంటివి చేస్తుంటారు. ఈ పనులు తనను రిలాక్స్ చేస్తాయని, క్రియేటివిటీని రీఛార్జ్‌ చేస్తాయని అతను నమ్ముతున్నాడు.
… ఇంకా చదవండి

Subscribe for notification
Verified by MonsterInsights