దరఖాస్తు ఇలా చేసుకోవాలి
దరఖాస్తును గ్రామ, వార్డు సచివాలయాల్లో అవసరమైన పత్రాలు జత చేసి దరఖాస్తులు అందజేయాలి. ఆధార్ కార్డు, కరెంట్ బిల్లు, రేషన్ కార్డు తదితర సంబంధిత వాటి జిరాక్స్ కాపీలను దరఖాస్తుకు జత చేయాలి. వచ్చిన దరఖాస్తులపై వీఆర్వో, తహసీల్దారు, ఆర్డీవో విచారించి ఉన్నతాధికారులకు నివేదిస్తారు. జిల్లా అధికార కమిటీ తుది నిర్ణయం తీసుకుంటుంది. అప్పుడు దరఖాస్తు చేసుకున్న అర్హులకు పట్టాలు ఇస్తారు. అయితే దరఖాస్తు చేసుకోకపోతే మాత్రం, వాటిని ఆ స్థలాలను ఆక్రమణగా గుర్తించి తొలగిస్తారు. అందుకే అభ్యంతరం లేని ఆక్రమణ ఇళ్ల నిర్మాణాలు చేపట్టేవారు దరఖాస్తు చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం కోరుతుంది.