AP DSC Notification 2025 : ఈసారి గ్యారెంటీ..! మరో 5 రోజుల్లో ఏపీ మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల?

Written by RAJU

Published on:

AP DSC Recruitment 2025 : గత కొన్ని నెలలుగా ఊరిస్తున్న ఏపీ డీఎస్సీ నోటిఫికేషన్‌ 2025 విడుదల సమయం ఆసన్నమైంది. ఈవారంలోనే ఏపీ డీఎస్సీ 2025 నోటిఫికేషన్‌ విడుదల కానుంది.

Samayam Teluguఏపీ డీఎస్సీ నోటిఫికేషన్‌ 2025
ఏపీ డీఎస్సీ నోటిఫికేషన్‌ 2025

AP DSC Notification 2025 Latest News : ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ఏపీ డీఎస్సీ నోటిఫికేషన్ (AP DSC Notification) విడుదలపై కీలక ప్రకటన చేశారు. మరో 5 రోజుల్లో AP DSC 2025 నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. తాజాగా జరిగిన సమీక్షా సమావేశంలో డీఎస్సీ నియామక ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ ప్రక్రియలో 16,347 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఎస్సీ వర్గీకరణ ప్రక్రియ పూర్తయినన తర్వాతే డీఎస్సీ నోటిఫికేషన్‌పై ముందుకెళ్దామని ఆలోచన చేయడంతోనే ఆలస్యమైందని చెప్పారు. ఎస్సీ కమిషన్‌ రిపోర్టుపై ఏప్రిల్‌ 15న క్యాబినెట్‌ ఆమోదం తెలిపిందని.. రెండు రోజుల్లో ఆర్డినెన్స్‌ ఇచ్చి ఆ తర్వాత నోటిఫికేషన్‌ విడుదల చేస్తామని మంత్రి లోకేష్ వెల్లడించారు.
కిషోర్‌ రెడ్డి

రచయిత గురించికిషోర్‌ రెడ్డికిషోర్‌ రెడ్డి డైనమిక్ రైటర్, డిజిటల్ మీడియా ప్రొఫెషనల్. ఈ రంగంలో 6.8 సంవత్సరాల అనుభవం ఉంది. అతను డిజిటల్ మీడియాలో తన ప్రస్థానం ప్రారంభించినప్పటి నుంచి రాజకీయ, సినిమా, విద్య, ఉద్యోగాలు సహా అనేక విభాగాలను నిర్వహించడంలో గణనీయమైన నైపుణ్యాన్ని పొందారు.
రాయడంలో అతనికున్న అభిరుచి, కరెంట్ అఫైర్స్‌పై లోతైన జ్ఞానంతో కిషోర్‌ ఈ పరిశ్రమలో తనకంటూ ఒక పేరు తెచ్చుకున్నారు. విభిన్న విభాగాలలోని పాఠకులకు ఆకర్షణీయమైన సందేశాత్మక కంటెంట్‌ను రూపొందించారు. ప్రస్తుతం అతను పనిచేస్తున్న విభాగంలో.. 4.5 ఏళ్లుగా నిర్దిష్ట విభాగాన్ని నిర్వహిస్తున్నారు. అతను వ్యూవర్స్‌కు నచ్చే అత్యంత నాణ్యమైన కంటెంట్‌ను స్థిరంగా అందిస్తున్నారు.
కిషోర్‌ ఖాళీగా ఉన్నప్పుడు పుస్తకాలు చదవడం, ప్రముఖుల ఇంటర్వ్యూలు చూడటం వంటివి చేస్తుంటారు. ఈ పనులు తనను రిలాక్స్ చేస్తాయని, క్రియేటివిటీని రీఛార్జ్‌ చేస్తాయని అతను నమ్ముతున్నాడు.
… ఇంకా చదవండి

Leave a Comment

Subscribe for notification
Verified by MonsterInsights