బీసీ, ఈబీసీ సబ్సిడీ రుణాల మంజూరుకు నిబంధనలు :
- అన్ని వనరులు కలుపుకుని గ్రామీణ ప్రాంతంలోని కుటుంబ ఆదాయం రూ.81,000 లేదా అంతకంటే తక్కువగా ఉండవలెను.
- 21 నుంచి 60 సంవత్సరాల మధ్య వయసు గలవారు అర్హులు
- తెల్ల రేషన్ కార్డు, కుల ధ్రువీకరణ పత్రం, ఆధార్ కార్డు తప్పనిసరిగా కలిగి ఉండాలి.
- ఒక కుటుంబంలో…తెల్ల రేషన్ కార్డులో ఒక్కరు మాత్రమే లబ్ది పొందుటకు అర్హులు.
వ్యవసాయ సంబంధ కార్యక్రమాలు, పరిశ్రమలు, చిన్న తరహా వ్యాపారం, సేవలు, రవాణా విభాగం వంటి సెక్టార్లకు సంబందించిన యూనిట్లకు సబ్సిడీపై రుణాలు మంజూరు చేస్తారు. పైన తెలిపిన విధంగా అర్హతలు కలిగిన వారు https://apobmms.apcfss.in/ ఈ నెల 10-03-2025 నుంచి 22-03-2025 వారి పేర్లను APOBMSS వెబ్సైటు లో నమోదు చేసుకోవాలని సూచించారు. తాజాగా దరఖాస్తు గడువును మార్చి 25 వరకు పెంచారు. స్వయం ఉపాధి పథకాలు, జనరిక్ మెడికల్ షాపుల కోసం డి.ఫార్మసీ, బి.ఫార్మసీ లేదా ఎం.ఫార్మసీ అర్హతలు కలిగిన నిరుద్యోగ యువత 25-03-2025 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.