Telangana 10th Results 2025 : తెలంగాణ పదో తరగతి ఫలితాలు విడుదలకు ఎస్ఎస్సీ బోర్డు ఏర్పాట్లు పూర్తి చేసింది. త్వరలో అధికారిక వెబ్సైట్లోకి అందుబాటులో ఉంచనుంది.
తెలంగాణ పదో తరగతి ఫలితాలు 2025 (ఫోటోలు– Samayam Telugu)
TS SSC Results 2025 Live : తెలంగాణ 10వ తరగతి ఫలితాలు విడుదలకు రంగం సిద్ధమైంది. ఒకటి రెండు రోజుల్లో ఫలితాలు విడుదల చేసేందకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. విద్యార్థులు తమ ఫలితాలను అధికారిక వెబ్సైట్ https://bse.telangana.gov.in/ ద్వారా తమ ఫలితాలు చెక్ చేసుకోవచ్చు. అంతే కాకుండా https://www.manabadi.co.in/ ద్వారా కూడా TS 10th Class Results 2025 చెక్ చేసుకోవచ్చు. ఈ ఏడాది సుమారు 5 లక్షల మంది విద్యార్థులు తెలంగాణ 10వ తరగతి పరీక్షలకు హాజరయ్యారు.
ఈసారి సరికొత్తగా మార్కుల మెమోలు
అయితే.. ఈ క్రమంలో మరో అప్డేట్ వచ్చింది. అదేమిటంటే.. ఈసారి పదో తరగతి మార్కుల మెమోలపై సబ్జెక్టుల వారీగా మార్కులు, గ్రేడ్లు ఇవ్వనున్నారు. ఈ మేరకు విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటి వరకు 10వ తరగతిలో సబ్జెక్టుల వారీగా గ్రేడ్లతో పాటు సీజీపీఏ ఇచ్చేవారు. ఇక నుంచి సీజీపీఏ కాకుండా సబ్జెక్టులవారీగా మార్కులు, గ్రేడ్లు ఇవ్వనున్నారు. మార్కుల మెమోలపై సబ్జెక్టుల వారీగా రాత పరీక్షలు, ఇంటర్నల్ మార్కులు, మొత్తం మార్కులు, గ్రేడు పొందుపరుస్తారు.
రచయిత గురించికిషోర్ రెడ్డికిషోర్ రెడ్డి డైనమిక్ రైటర్, డిజిటల్ మీడియా ప్రొఫెషనల్. ఈ రంగంలో 6.8 సంవత్సరాల అనుభవం ఉంది. అతను డిజిటల్ మీడియాలో తన ప్రస్థానం ప్రారంభించినప్పటి నుంచి రాజకీయ, సినిమా, విద్య, ఉద్యోగాలు సహా అనేక విభాగాలను నిర్వహించడంలో గణనీయమైన నైపుణ్యాన్ని పొందారు.
రాయడంలో అతనికున్న అభిరుచి, కరెంట్ అఫైర్స్పై లోతైన జ్ఞానంతో కిషోర్ ఈ పరిశ్రమలో తనకంటూ ఒక పేరు తెచ్చుకున్నారు. విభిన్న విభాగాలలోని పాఠకులకు ఆకర్షణీయమైన సందేశాత్మక కంటెంట్ను రూపొందించారు. ప్రస్తుతం అతను పనిచేస్తున్న విభాగంలో.. 4.5 ఏళ్లుగా నిర్దిష్ట విభాగాన్ని నిర్వహిస్తున్నారు. అతను వ్యూవర్స్కు నచ్చే అత్యంత నాణ్యమైన కంటెంట్ను స్థిరంగా అందిస్తున్నారు.
కిషోర్ ఖాళీగా ఉన్నప్పుడు పుస్తకాలు చదవడం, ప్రముఖుల ఇంటర్వ్యూలు చూడటం వంటివి చేస్తుంటారు. ఈ పనులు తనను రిలాక్స్ చేస్తాయని, క్రియేటివిటీని రీఛార్జ్ చేస్తాయని అతను నమ్ముతున్నాడు.… ఇంకా చదవండి