ABN
, Publish Date – Apr 03 , 2025 | 03:07 AM
దేశంలో డిజిటల్ చెల్లింపులు జోరందుకున్నాయి. గత ఏడాది జూలై-డిసెంబరు మధ్య కాలంలో నమోదైన యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ (యూపీఐ) లావాదేవీలే…

2024 జూలై-డిసెంబరు మఽధ్య 4% వృద్ధి
న్యూఢిల్లీ: దేశంలో డిజిటల్ చెల్లింపులు జోరందుకున్నాయి. గత ఏడాది జూలై-డిసెంబరు మధ్య కాలంలో నమోదైన యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ (యూపీఐ) లావాదేవీలే ఇందుకు ఉదాహరణ. ఈ కాలంలో దేశవ్యాప్తంగా 9,323 కోట్ల యూపీఐ లావాదేవీలు నమోదయ్యాయి. అంతకు ముందు ఆరు నెలలతో పోలిస్తే ఇది 42ు ఎక్కువని వరల్డ్లైన్ సంస్థ తాజాగా విడుదల చేసిన తన ‘ఇండియా డిజిటల్ పేమెంట్స్ రిపోర్ట్ ఫర్ 2హెచ్, 2024’లో పేర్కొంది. లావాదేవీల సంఖ్య, లావాదేవీల విలువ పరంగా చూస్తే ఫోన్పే, గూగుల్ పే, పేటీఎంలు 92-93ు మార్కెట్ వాటాతో అగ్రస్థానంలో ఉన్నాయి. గత ఏడాది జూలై-డిసెంబరు మధ్య కాలంలో యూపీఐ చెల్లింపుల విలువ రూ.99.68 లక్షల కోట్ల నుంచి 31ు వృద్ధితో రూ.130.19 లక్షల కోట్లకు చేరింది.
ఇవి కూడా చదవండి:
Loan Charges: ఏప్రిల్లో పర్సనల్ లోన్స్పై ప్రధాన బ్యాంకులు వసూలు చేసే వడ్డీ రేట్లు
Business Idea: మహిళలకు బెస్ట్..లక్ష పెట్టుబడితో వ్యాపారం, నెలకు రూ.3 లక్షల ఆదాయం..
Read More Business News and Latest Telugu News
Updated Date – Apr 03 , 2025 | 03:07 AM