As we speak Gold Charge: స్వల్పంగా తగ్గిన గోల్డ్, వెండి ధరలు..

Written by RAJU

Published on:

బిజినెస్ న్యూస్: గత కొన్ని రోజులుగా భారీగా పెరుగుతున్న బంగారం ధరలకు బ్రేక్ పడింది. పసిడి (Gold), వెండికి (Silver) మార్కెట్లో (Market) ఎల్లప్పుడూ డిమాండ్ (Demand) ఉంటుంది. అయితే పసిడి, వెండి ధరలు గత కొంత కాలం నుంచి పరుగులు పెడుతున్న సంగతి తెలిసిందే. ఒక్కోసారి మార్కెట్లో ధరలు పెరిగితే మరి కొన్నిసార్లు తగ్గుతూ కనిపిస్తాయి. గత రెండు మూడు రోజుల నుంచి గోల్డ్, వెండి ధరలు స్వల్పంగా పెరుగుతున్నాయి. ఈ క్రమంలో గురువారం బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. గోల్డ్ గ్రాముకు 2 రూపాయలు తగ్గింది. అలాగే వెండి కేజికి రూ. 200 తగ్గింది. గోల్డ్ ధరలు ప్రపంచ బంగారం ధరలపై ఆధారపడి ఉంటాయి, ద్రవ్యోల్బణం, ప్రపంచ ధరలలో మార్పు, కేంద్ర బ్యాంకు బంగారు నిల్వ, హెచ్చుతగ్గుల వడ్డీ రేట్లు, ఆభరణాల మార్కెట్లు వంటి అనేక అంతర్జాతీయ అంశాల ద్వారా ఇవి ప్రభావితమవుతాయి. హైదరాబాద్ (Hyderabad) నగరంలో బంగారం ధరలు స్ధిరంగా ఉండటం లేదు. గతేడాదితో పోలిస్తే భారీగానే పెరుగుతూ వస్తోంది.

Also Read..: వక్ఫ్‌ బిల్లుకు లోక్‌సభ ఓకే

అయితే అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ (Trump) రెండోసారి పగ్గాలు చేపట్టిన తర్వాత పసిడి ధర పెరిగింది. ఆయన తీసుకుంటున్న వరస సంచలన నిర్ణయాలతో అంతర్జాతీయ మార్కెట్లు బెంబేలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలోనే మదుపరులంతా గోల్డ్‌ని సురక్షితమైన పెట్టుబడిగా భావిస్తున్నారు. దిగుమతి సుంకాలను ట్రంప్ భారీగా పెంచారు. దీంతో పెట్టుబడుదారులంతా ఒక్కసారిగా పసిడి వైపు మెుగ్గు చూపడంతో గోల్డ్ ధర రోజు రోజుకు పెరుగుతోంది.

తాజాగా హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర గ్రాముకు 2 రూపాయలు తగ్గింది. 1 గ్రాము రూ. 8,509 కాగా 10 గ్రాముల ధర రూ. 85,090గా ఉంది. అలాగే 24 క్యారెట్ల బంగారం ధర గ్రాముకు గ్రాముకు 2 రూపాయలు తగ్గింది. ఒక గ్రాము రూ. 9,283 కాగా 10 గ్రాముల ధర రూ. 92,830గా ఉంది. ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖ, విజయవాడలో ఇవే ధరలు కొనసాగుతున్నాయి.

దేశవ్యాప్తంగా బంగారం (22, 24 క్యారెట్ల) ధరలు ఎలా ఉన్నాయంటే..

కోల్‌కతా- రూ.85,090, రూ.92,830

చెన్నై- రూ.85,090, రూ.92,830

బెంగళూరు- రూ.85,090, రూ.92,830

పుణె- రూ.85,090, రూ.92,830

అహ్మదాబాద్- రూ.85,140, రూ.92,880

భోపాల్- రూ.85,140, రూ.92,880

కోయంబత్తూర్- రూ.85,090, రూ.92,830

పట్నా- రూ.85,140, రూ.92,880

సూరత్- రూ.85,140, రూ.92,880

పుదుచ్చెరి- రూ.85,090, రూ.92,830

వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

హైదరాబాద్‌లో కేజీ వెండి రూ. 200 తగ్గి… రూ. 1,13,900గా ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి రూ. 200 తగ్గి.రూ.1,04,900గా ఉంది. ఆర్థిక రాజధాని ముంబైలో కిలో వెండి రూ. 200 తగ్గి.రూ.1,04,900 వద్ద కొనసాగుతోంది. ఇక విజయవాడలో కేజీ ధర రూ.1,13,900గా ఉంది, విశాఖపట్నంలో కిలో వెండి ధర రూ. 1,13,900 వద్ద కొనసాగుతోంది.

ఈ వార్తలు కూడా చదవండి..

తిరుమల ఎంత భద్రం

శాంతికి మేం సిద్ధం

For More AP News and Telugu News

Updated Date – Apr 03 , 2025 | 07:25 AM

Leave a Comment

Subscribe for notification
Verified by MonsterInsights