KKR vs RR: మ్యాచ్ ఓడిన తర్వాత వీల్‌చైర్‌లో గ్రౌండ్‌లోకి వచ్చి.. ప్రత్యర్థి ప్లేయర్‌ ద్రావిడ్‌ చూడండి ఏమన్నాడో?

Written by RAJU

Published on:


ఐపీఎల్‌ 2025లో భాగంగా రాజస్థాన్‌ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ ఘన విజయం సాధించింది. అస్సాంలోని గౌహతీలో జరిగిన మ్యాచ్‌లో కేకేఆర్‌ 8 వికెట్ల తేడాతో గెలిచింది. ఆర్సీబీతో జరిగిన తొలి మ్యాచ్‌లో ఓటమి పాలైన కేకేఆర్‌.. ఆర్‌ఆర్‌పై విజయంతో ఈ సీజన్లో తొలి విక్టరీని అందుకుంది. తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆర్‌ఆర్‌ను కేకేఆర్‌ బౌలర్లు అద్భుతంగా నిలువరించారు. ఆ తర్వాత కేకేఆర్‌ ఓపెనర్‌ క్వింటన్‌ డికాక్‌ సూపర్‌ బ్యాటింగ్‌తో దుమ్మురేపాడు. కాగా, మ్యాచ్‌ తర్వాత గ్రౌండ్‌లో ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. ఆర్‌ఆర్‌ హెడ్‌ కోచ్‌గా ఉన్న రాహుల్‌ ద్రావిడ్‌ కాలికి గాయమైనా.. జట్టు కోసం కాలికి పెద్ద కట్టుతో టీమ్‌తోనే ఉన్న విషయం తెలిసిందే.

బుధవారం సైతం కేకేఆర్‌ వర్సెస్‌ ఆర్‌ఆర్‌ మ్యాచ్‌లో ద్రావిడ్‌ వీల్‌ చైర్‌లో గ్రౌండ్‌లోకి వచ్చాడు. అయితే ద్రావిడ్‌ గ్రౌండ్‌లోకి వచ్చి.. ప్రత్యర్థి జట్టు ఆటగాడు, తమ ఓటమిని శాసించిన క్వింటన్‌ డికాక్‌తో మాట్లాడి, అతన్ని అభినందించడం విశేషం. ద్రావిడ్‌, డికాక్‌తో మాట్లాడుకున్న ఫొటోలు, వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. వీల్‌ చైర్‌లో ఉండి కూడా.. ప్రత్యర్థి టీమ్‌ ప్లేయర్‌ ఆటకు ఫిదా అయి అతన్ని ప్రత్యేకంగా ప్రశంసించడం ద్రావిడ్‌కే చెల్లుతుందని, అంతటి స్పోర్ట్స్‌మెన్‌ స్పిరిట్‌ ఉంది కాబట్టే.. అన్నేళ్ల అంతర్జాతీయ కెరీర్‌లో వివాదారహితుడిగా ద్రావిడ్‌ పేరు తెచ్చుకున్నాడంటూ క్రికెట్‌ అభిమానులు ద్రావిడ్‌ను అభినందిస్తున్నారు.

ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. ఫస్ట్‌ బ్యాటింగ్‌కు దిగిన ఆర్‌ఆర్‌ 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి కేవలం 151 పరుగులు మాత్రమే చేసింది. పిచ్‌ నుంచి బ్యాటింగ్‌కు అంతగా హెల్ప్‌ లేకపోయినా.. ఆర్‌ఆర్‌ బ్యాటర్లు అగ్రెసివ్‌ బ్యాటింగ్‌ చేసేందుకు ప్రయత్నించారు. కానీ, వారి ఎటాకింగ్‌ గేమ్‌ స్ట్రాటజీ అంతగా రిజల్ట్‌ ఇవ్వలేదు. ఓపెనర్‌ సంజు శాంసన్‌ 13, నితీష్‌ రాణా 8, వనిందు హసరంగా 4, శుభమ్‌ దూబే 9, హెట్‌మేయర్‌ 7 చాలా దారుణంగా విఫలం అయ్యారు. యశస్వి జైస్వాల్‌ 29, రియాన్‌ పరాగ్‌ 25, ధృవ్‌ జురెల్‌ 33లు పర్వాలేదనిపించారు కానీ, పెద్ద ఇన్నింగ్‌లు ఆడలేకపోయారు. చివర్లలో జోఫ్రా ఆర్చర్‌ ఓ రెండు భారీ సిక్సులతో అలరించాడు.

మొత్తంగా ఆర్‌ఆర్‌ కేవలం 151 పరుగుల సాధారణ స్కోర్‌కే పరిమితమైంది. సునీల్‌ నరైన్‌ స్థానంలో ప్లేయింగ్‌ ఎలెవన్‌లోకి వచ్చిన మొయిన్‌ అలీ అద్భుతంగా బౌలింగ్‌ చేశాడు. కేకేఆర్‌ జట్టులో బౌలింగ్‌ వేసిన ప్రతి బౌలర్‌కు వికెట్‌ దక్కింది. వైభవ్‌ అరోరా, హర్షిత్‌ రాణా, మొయిన్‌ అలీ, వరుణ్‌ చక్రవర్తి రెండేసి వికెట్లు తీసుకున్నారు. స్పాన్సర్‌ జాన్సన్‌ ఒక వికెట్‌ తీసుకున్నాడు. ఇక 152 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన కేకేఆర్‌ 17.3 ఓవర్లలో కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 153 పరుగులు చేసి విజయం సాధించింది. తొలి మ్యాచ్‌లో ఆర్సీబీ చేతుల్లో ఓటమిపాలైన కేకేఆర్‌, ఈ మ్యాచ్‌లో గెలిచి, ఈ సీజన్‌లో తొలి విజయాన్ని అందింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Subscribe for notification
Verified by MonsterInsights