లాఠీలకు పనిచెప్పిన పోలీసులు..
ఒక్కసారిగా అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడటం, తొక్కిసలాట జరిగే ప్రమాదం ఉండటంతో ఏసీపీ కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో పోలీసులు లాఠీలతో ఇరుపార్టీల నాయకులను చెదరగొట్టారు. అయినా కొంతమంది నాయకులు వినకుండా అలాగే నినాదాలు చేయడం, ఒక దశలో పరిస్థితి కంట్రోల్ తప్పే ప్రమాదం ఏర్పడింది. పలువురిపై పోలీసులు లాఠీ ఛార్జ్ కూడా చేశారు. అనంతరం రెండు పార్టీల నాయకులను వేర్వేరుగా చేసి, అక్కడి పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేశారు.